LOCAL WEATHER

23, మార్చి 2014, ఆదివారం

మత చిచ్చు పెడుతున్న తిరుమల అవినీతి అగ్ని...

కర్టేసి:గూగుల్ ఇమేజెస్ 

కొద్ది రోజులుగా తిరుమలలో ఉన్న అడవులలో కార్‌చిచ్చు ప్రబలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినాయి... అవి ఆర్పడం గురించి కన్నా అవి ఎందుకు ప్రబలినాయో ఎవరికి తోచినట్లుగా వారు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్పుకు పోతున్నారు... చివరకు ఎలాగైతేనే మన నేవీ వారి సహాయ సహకారాలవలన అవి చల్లారిపోతున్నాయి...

అయితే ఆ మంటలు చల్లారుతున్నా, అవి ఎందుకు ప్రబలినాయో అన్న అనుమానపు మంటలు చల్లారటం లేదు... ఈ విషయంలో మతం మాటను ఎవరు పైకి తెచ్చారో కానీ, ఎవరో అన్య మతస్తులు వలనే ఇది జరిగింది అని ఎక్కడో ఉన్న విశాఖ స్వామీజీ గారు కూడా అనేశారు. ఇది ఆయన తెలిసి అన్నారో లేదో తెలియదు కానీ... ఇదంతా చూస్తుంటే ఆ మంటలు కావాలని రాజేసినవే అని మడుకూ అర్ధం అవుతున్నది...

ఇవి అలా ఎవరు రాజేశారు అని అనగానే... అనుమానం సహజంగానే మతాలన[అ]మ్ముకొనే వారి మీదకే పోతాయి... కాని, ఈ విషయంలో ఇది ఇలాగే అనుమానం తేవాలనే, కొందరు పనిగట్టుకొని... అసలు విషయాన్ని జనానికి తెలియకుండా ఉంటానికే అలా ప్రచారం చేస్తున్నారా... అని అనిపించక మానదు...!!

ఈ అనుమానాలని ప్రక్కన పెట్టి, కొద్ది నెలలుగా జరిగే సంఘటనలని తీసుకుంటే ఈ మంటలకి కారణం ఎవరో ఇట్టే తెలిసిపోతుంది... అనేక ఏళ్ళుగా తిరుమల అటవీ సంపదని కొల్లగొడుతున్న చందన స్మగ్లర్లు; కొద్ది నెలలుగా బరితెగించి పోలీసుల మీదే తిరగబడటం, ఆ అడవి తమ స్వంతం అని అన్నట్లుగా పొగరు చూపించటం, దానికి తగ్గట్లుగా వీరికి రాజకీయ నాయకులలో కొందరి అండ ఉందనే వాదనలూ... ఇవన్నీ చూస్తుంటే ఈ దుస్సాహసానికి చందన స్మగ్లర్లూ, వారితో కలిసిన కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్న అధికారులూ...కారణం అనిపిస్తోంది...

ఏదైనా ఆఫీసులలో అవినితి జరిగినప్పుడు సహజంగా ఆ ఆఫీసుకి అగ్ని గండం ఉంటుంది... ఆ ఆఫీసు ఎంత కాంక్రీటు బిల్డింగులో ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో పేద్ద బిల్డింగులో ఉండి బ్రహ్మాణ్ణమైన కాపలా ఉన్నప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగి..."కాలాలిసిన ఫైళ్ళు కాలేదాకా" ఆ మంటలు అదుపులోనికి రావు పాపం...ఎన్నొ ఆధునిక ఫైరింజన్లు ఉన్నప్పటికీ..

ఏదైనా అడవిలో ఏ రకం చెట్లు ఎన్ని ఉన్నాయి లాంటి వివరాలు అటవీ శాఖ వారి వద్ద ఉంటాయి....ఆ ఫైళ్ళ నకళ్ళు రాజధానిలో ఉంటాయి... మరి ఇన్నాళ్ళూ జరిగిన చందనం, ఇతర వృక్షాల స్మగ్లింగు అవినీతిని చెరిపెయ్యటం ఎలా... పైన మనం చెప్పుకున్నట్లుగా దానికి సంబంధించిన ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే పోలా...చాలా తేలికే మరి... అయితే ఇప్పుడున్న పరిస్తితులలో ఏ తిరుపతి ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగితే కుదరదు కదా...హైదరాబాదులో కూడా దానికి ప్రతిస్పందన రావాలి కదా... కానీ అక్కడ ఉన్నది ఏ సాదాసీదా రాజకీయ నాయకుడో కాదు..."నారసిమ్హుడు". 

నారసిమ్హుడి ప్రతి స్పందన ఎలా ఉంటుందో దొంగ పెట్రోల్ బంకుల స్ట్రైకులో  చూశారు...కాబట్టి ఈ ఆఫీసు అగ్నిప్రమాదం కుదరదు...పొనీ ఎలక్షన్ల తరవాత చూసుకుందాము అంటే అప్పుడు రాజెవరో...__...ఎవరో తెలియదు కదా... ఎందుకొచ్చిన గొడవ, ఈ తిరుమల అడవుల అవినీతిని నానబెట్టటం ఎందుకు... ఆఫీసులో కాకపోతే అడవిలో అగ్నిప్రమాదం జరగదా... పైగా అది ఇంకా తేలిక కూడా... అని అవినీతి దోంగలు అనుకోవటం వల్లనే తిరుమలలో అవినీతి మంటలు చెలరేగినాయి... అప్పుడు రికార్డులుంటాయి కాని, అడవే ఉండదు కదా... లెక్కల్లో తేలని అడవి, అగ్నికి సమర్పయామి అని సర్ది చెప్పుకోవచ్చును కదా...!!!

తిరుమలకి భక్తిగా వచ్చే భక్తుల లింగ భేదం చూడకుండా... అందరి ఒళ్ళంతా తడిమి మరీ చెకింగు చేసి... వంటిమీద దుస్తులు తప్ప మంచి నీళ్ళ సీసాకూడా వదలకుండా అన్నీ ఊడగొట్టి మరీ పంపించే కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట  మంటలు చెలరేగినాయి...!!! ఎవరికీ పట్టలేదు...!!! ఎదో రెండిళ్ళు తగలడుతుంటే ఫైరింజనువాళ్ళు వచ్చి ఆర్పినట్లుగా ఆర్పితే ఆ మంటలు చల్లారుతాయా...? ఈ విషయం అక్కడ ఉన్న అధికారులకి తెలియదా...?? ఒక వేళ తెలిస్తే, ఎందుకు అన్ని రోజులు మిన్నుకుండిపోయ్యారు...??? రోజూ పేపర్లోనూ...టీవీల్లోనూ కొత్త న్యూసు క్రింద రావటానికా...?!? "కాలాలిసిన ఫైళ్ళు కాలిన తరవాత" అప్పుడు నేవీ వారి సహాయాన్ని నిదానంగా వారికి వినపడనంతగా అడిగారు...పాపం...నేవీ వారు ఆలస్యంగం వచ్చినా ఆ మంటలని చక్కగా అదుపులోనికి తీసుకొచ్చారు. ఇదే మొదటి రోజునే, ఆ మంటల తీవ్రతని కనిపెట్టి నేవీ వారి సహాయం తీసుకుని ఉన్నట్లైతే, అంతటి నష్టం జరిగేదా...??

ఇంతకీ విషయం చెప్పొచ్చేదేమంటే... తిరుమలలో అగ్నిని దారి మళ్ళీంచినది ఎవరో కానీ... చాలా తెలివిగా...సినిమాలోలాగా ఒకరు మర్డరు చేసి... "అప్పుడే గొడవ పెట్టుకుని వెళ్ళిన మరొక వ్యక్తి ఐడెంటిటీని, కావాలని పడేసినట్లుగా" ఆ అవినీతి అగ్నికి మతం రంగేసి దారి మళ్ళీంచారు...


దీనిని కనుక ఉపేక్షిస్తే, 
హైదరాబాదులో అధికార మార్పిడికోసం జరిగే 
మతకల్లోలాలు లాంటివి 
కేవలం తిరుపతిలోనే కాక 
రాష్ట్ర వ్యాప్తంగా అంటుకునే అవకాశం ఉన్నది...
కాబట్టి, 
ఈ తిరుమల అవినీతి మంటల వ్యవహారాన్ని 
తేలిగ్గా తీసిపారెయ్యక 
అత్యున్నత సంస్థచే విచారణ జరిపి, 
అసలైన దోషులని శిక్షించాలి... 
అప్పుడే ప్రజలలో ఉన్న అనవసర అపొహలు తొలగి 
మత చిచ్చులు రేగకుండా ఉంటాయి...



@@@@@@@@@@@


                                                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి