LOCAL WEATHER

30, మే 2014, శుక్రవారం

పేరులో... 'నేమున్నది....!!!


వెనుకటికి ఒక పేద్ద కుటుంబంలొ పుట్టిన పిల్లాడికి భారసాల చేస్తుండగా...ఎవరికి వారు తమ పేరు ఉండాలని "వీర వెంకట శివ శాయి భిమ శంకర  క్రిష్ణ  వర ప్రసాదు"....లాంటి పేరెట్టేసి, ఆనక ఆ ఆనందంలొ గాట్టిగా భోజనం చేసి...పొతూ పొతూ "హై బుజ్జీ టాటా" అని ఒకరు, "ఒరే చిట్టీ వెళ్ళొస్తాంరా" అని మరొకరూ...రకరాకాలైన ముద్దు పేర్లెట్టి పిలిచారే కాని, అసలు పేరుతో ఒక్కరూ పిలవలేదు. 

అలాగే..."షమ్షాబాదు  విమానాశ్రయానికి పేరు మారుస్తారుష" అని అనంగానే... దాని అసలు పేరు షంషాబాదుయేమో అని అనేసుకునేరు... దాని పేరు రాజివ్ గాంధి విమానాశ్రయంట.... దీనికి మన ఎంటివోడు పేరెట్టేయ్యాలని చాలామందికి తహ తహ లాడింది... దాంతో అగ్గి రాజుకుంది... అసలే అక్కడ అంతర్జాతీయ చట్టాలు కూడా చెల్లవు... అలాంటి ప్రాంతంలో మరొక ప్రాంతపు తెలుగుదేశం నేత పేరా.... ఇప్పటికే ఒకాయన అనేసాడు...అది ప్రక్కరాష్టం పార్టీ అని...దానికి తమ ప్రాంతంలో చోటు లేదని... మరి కాంగ్రెస్సు-బిజెపిలు ఏ ప్రాంతపు పార్టిలో ఆయనకే తెలియాలి. అయితే గియితే "ఇప్పుడు ఆంధ్రలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆంధ్రావి కావు...వాటి హెడ్ ఆఫీసులు ప్రక్క రాష్ట్రాలలో ఉండటమే కాదు...వాటి హెడ్ నాయకుల ఓట్లు కూడా ఆంధ్రలో లేవు"...

సరే విషయంలోనికి వస్తే...పేరు మార్చటం మీద ప్రాంతీయ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతూ మరొక ప్రాంతపు నేత పేరు పెడితే, మేము మా ప్రాంతంలో ఉన్న అన్ని పేర్లనీ మార్చేస్తాము అని అంటున్నారు... ఇంతకీ రాజివ్ గాంధి  ఆ ప్రాంతానికి చెందిన వారా అంటే కాదు... మరేమిటి సమస్యా... అన్న దమ్ములు కొట్టుకున్నప్పుడు "ఏదైనా సరే తమ వారికి కాకుండా ఎవడికి పోయినా సరె పరవాలేదు" అని అనుకున్నట్లే, రాజివ్ గాంధి పేరున్నా మరే పేరున్నా పరవాలేదు... 

అయితే, ఈ గోల ఎలా ఉన్నా...ఇప్పటికే ఉన్న పేరుతో కాకుండా దానిని "షంషాబాదు విమానాశ్రయం" అని పిలుస్తున్నప్పుడు... అక్కడ బోర్డు మీద ఏ పేరుంటే ఏమున్నది కనుక...  అనవసర అల్లరి తప్ప.

కొసమెరుపేమంటే , ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కానీ, మరే ప్రజా సమస్యలలో కానీ కనపడకుండా ఉన్న జీవచ్చవం అయిన ఆంద్ర కాంగ్రెస్సు నాయకత్వం వెంటనే స్పందించి...పేరుని మార్చటాన్ని తీవ్రంగా ఖండించి పారేసింది. ఏమి స్వామీ భక్తీ...


@@@@@@@@@@@@@@@



17, మే 2014, శనివారం

నిరంకుశం ఓడిపోయింది... ప్రజాసామ్యం గెలిచింది...!!!

ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో{23జిల్లాలు}జరిగిన ఎన్నికలని చూస్తే ప్రజాసామ్యమే గెలిచిందని గాఠిగా చెప్పలేకపోయినా... ఓడిపోయింది మాత్రం నిరంకుశ కాంగ్రెస్సే అని నిస్సందేహంగా చెప్పవచ్చును... అలా అని, ఇప్పుడు గెలిచిన ఏ పార్టీనో నెత్తికి ఎత్తుకోబోవటం లేదు... 

ముందరగా, సీమాంధ్రలో చూస్తే... కాంగ్రెస్సు దుర్గతి కన్నా అది ప్రజాసామ్యానికి చేసిన ద్రోహ ఫలితం ఏమిటో తెలుస్తుంది. ఇక్కడి ప్రజలలో అంతటి ఆగ్రహాన్ని కలిగించినది... కాంగ్రెస్సు వారి 10 ఏళ్ళ పరిపాలన కాదు...అలాంటివి క్షమించటం సీమాంధ్రులకి అలవాటే...అయితే విభజనే అని అనుకుంటున్నారా... కానే కాదు...మరింకేమిటీ...

కాంగ్రెస్సు రాష్ట్రాన్ని విభజన చేసిన విధానమే. అది పూర్తిగా ప్రజాసామ్యానికి వ్యతిరేకంగా ఉండటమే... ఏ వ్యవస్థ ఆధారంతో కాంగ్రెస్సు వారు అయిదేళ్ళకొకసారి అధికారాం పొందుతున్నారో ఆ వ్యవస్థనే వారు అపహాస్యంపాలు చేసేశారు. విభజన అనేది కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ... ఎక్కువమంది ప్రజలు దానికి వ్యతిరేకం కాదు. పైగా "ఆ విభజనేదో 1972లోనే జరిగితే బాగుండేది కదా" అని విమర్శించినవారే ఎక్కువ. అలాంటి విభజనని పార్లమెంటుని సంతలాగా మార్చి సీమాంధ్రులని అవమానించి మరీ చేశారు.

విభజన జరిగిన రోజున కాంగ్రెస్సు కార్యాలయాలన్నిటినీ అగ్గెట్టేస్తారని చాలమంది అనుకున్నారు. ఆశ్చర్యంగా ఆ రోజునగానీ...తరవాత రోజుల్లో కానీ కాంగ్రెస్సు కార్యాలయాలకి పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు... అదే "నిశ్శబ్ద ప్రజాసామ్య విప్లవానికి తెరలేపింది". ప్రజాసామ్యం అంటే గౌరవం లేనివారికి దౌర్జన్యంగా కనుక బుద్ధి చెపితే... బుద్ధి వచ్చే అవకాశం  లేదు...పైగా వారికీ వీరికీ తేడా ఉండదు కదా... అందుకనే ఎన్నికలలో "ప్రజాసామ్యయుతమైన దౌర్జన్యాన్ని కాంగ్రెస్సు మీద చూపించారు"... నాయకులూ లేరు... మంత్రులూ లేరు అందరినీ మట్టి కరిపించారు. 

కాంగ్రెస్సు వారు తెలంగాణావారి మన్ననలని పొందుదామనే క్రమంలో ప్రజాసామ్యం ద్వారానే మనం వచ్చాము... మనకి మిగిలిన దేశంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తెలుగువారు వెన్ను దట్టి నిలబెట్టారు అనే కృతజ్ఞతా భావం లేకుండా, ఏమి చేసినా పరవాలేదు అనే నిరంకుశ దురహంకారాన్ని ప్రదర్శించారు. దాని ఫలితంగానే "ఎప్పుడూ మేమున్నాము అని అక్కున చేర్చుకునే సీమాంధ్రులు... కాంగ్రెస్సుని నేలనేసి రాసేశారు". 

ఇక తెలంగాణా సంగతికొస్తే...సేమాధ్రులని తిడితే/అవమానిస్తే ఎక్కువ ఓట్లు తెలంగాణాలో పడతాయన్న కాంగ్రెస్సువారు అనుకున్నారు. ఇక్కడే పప్పులో కాదు... నిరంకుశంలో కాలేశేశారు... ఎంత తెలంగాణా వారికీ...సేమాంధ్ర వారికీ అబిప్రాయ భేదాలున్నా అంతా తెలుగువారే కదా... తెలంగాణా రావటం 10 జిల్లాలవారికి ఇష్టం అయినప్పటికీ; వచ్చిన విధానం ప్రజాసామ్యకంగా...గౌరవంగా లేకపోవటంతో, తెలంగాణా ప్రజల మన్నలని కాంగ్రెస్సువారు పొందలేకపొయారు.  తెలంగాణాని ఇచ్చింది కాంగ్రెస్సు వారే అయినప్పటికీ..."స్వంత సొమ్ముని దొంగతనం చెయ్యవలసిన ఖర్మేం పట్టింది" అని అనుకున్న తెలంగాణావారు, ఆ విషయాన్ని కాంగ్రెస్సుకి తమ ఓటు ద్వారా మెస్సేజ్‌ని పంపించారు.     

ఈ విధంగా ఎన్నికల ఎత్తులు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్సు, రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది. కాంగ్రెస్సుకి మాత్రమే పడే ఓటింగు తెలంగాణాలో టీఆరెస్స్‌కి పడితే...సీమంధ్రలో ఓట్లు ఎక్కువ భాగం వైఎస్సార్సీపీకి పడినాయి.   ఈ వాత కాంగ్రెస్సుకి సహకరించిన బీజేపీకి కూడా పూర్తిగా పడేదే... కానీ, వారు లోకల్ వారి కాళ్ళు పట్టుకోవటంతో ముప్పు తప్పినా... దేశమంతా మోడీ హవా నడిస్తే...అది ఆంధ్రప్రదేశ్‌లో ఏమంత కనపడకుండా చెసేసింది.    

కాబట్టి, ఓ నేతలారా... ఇకనైనా బుద్ధి కలిగి, "ప్రజాసామ్యంతోనే మనం అధికారంలోనికి వస్తాము అన్న జ్ఞానాన్ని కలిగి, ప్రజాసామ్యాన్ని గౌరవిస్తూ, ప్రజాసామ్యయుతంగానే ఏ పనినైనా చేస్తు ఉంటే... కాంగ్రెస్సుకి నేడు ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన గతి మరే పార్టీకీ పట్టదని" తెలుసుకోండి...  

అలాగే, ఒకరిని తిట్టి వేరోకరిని మంచి చేసుకుందాము అని తెలంగాణా,సీమాంధ్రలోని ఏ ఇతర పార్టీల నాయకులుగానీ వేరోకరుగానీ అనుకుంటే... వారిని తెలుగువారు ప్రజాసామ్యయుతంగానే చెంప దెబ్బ కొడతారని తెలుసుకొండి. ఇకనైనా ప్రజాసామ్యయుతమైన భాష వాడుతూ...తెలుగువారి అభివృద్ధి మీదే దృష్టి పెట్టండి. అదే మీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది.



జై హింద్ 



బొమ్మలు గూగుల్ -మిక్సింగ్ కేఆర్కే 




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@







12, మే 2014, సోమవారం

విభజనకి తొందరేమొచ్చింది..???


ఆంధ్రప్రదేశ్ నుండి 
తెలంగాణా పేరుతో కొత్త రాష్ట్రం విడిపోవటాన్ని
 పార్లమెంటులోనూ-రాష్ట్రపతి దగ్గరా ఖచ్చితం చేసినప్పుడు...
దీనిని క్రమ పద్ధతిలోనే చెయ్యవచ్చును కదా... 
అనవసర హడావిడిని... అలవిగాని వాళ్ళు చేత చేయించి, 
తరవాతి రోజుల్లో 
ప్రజల మధ్య దశాబ్దాలబాటూ చిచ్చుపెట్టటం దేనికి...??? 
మాములుగా ఏ కొద్దిపాటి ఆస్తి ఉన్న అన్నదమ్ములు కూడా, 
దగ్గర ఉండి తమ ఆస్తులని పంపకం చేసుకుంటారు. 
అన్నదమ్ములలో ఏ ఒక్కరు అక్కడ లేకపోయినా 
ఆస్తుల పంపిణీని చెయ్యరు. 
దీని వల్లన ఏదైనా అభిప్రాయ భేదం వచ్చిందంటే 
అప్పటికప్పుడే సర్దుబాటు చేసుకోటానికి వీలుంటుంది. 
తరవాత రోజుల్లో "నేను లేనప్పుడు జరిగిపోయింది... 
నాకు అన్యాయం జరిగింది" 
అని రాద్ధాంతం చేసే అవకాశం ఏ ఒక్కరికీ ఉండదు...

అలాగే ఇంత పేద్ద రాష్ట్రాన్ని విభజించటం జరుగుతున్నప్పుడు; సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు లాంటి వారు లేకుండా... అంటే పరోక్షంగా ప్రజల భాగసామ్యం లేకుండా.... కేవలం జీతాల కోసం పనిచేసే ఉద్యోగులు  మన ప్రాంతం గురించి తెలియని అధికారి పర్యవేక్షణలో ఆస్తుల పంపిణీని చేస్తే అది న్యాయంగా జరుగుతుందా...?? తరవాతి రోజుల్లో అనేక వివాదాలని రేపి ప్రజల మధ్యలో చిచ్చు రేపకుండా ఉంటుందా...??? ఎందుకంటే ఈ ఉద్యమమే సెంటిమెంటు మీద ఆధారపడినది...మరి దానికి సంబంధించినవారు ఒక్కరు కూడా అక్కడ లేకుండా విభజన చెయ్యటం సమంజసమా...??? ఎంతో ఆస్తిగల అన్నదమ్ములు...విడిపోయి అన్నదమ్ములలాగా కలిసి ఉందామన్న వారు, ఆస్తుల పంపకం జరిగేటప్పుడు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉన్నది కదా.... కానీ, ఆ బాధ్యత కనపడటం లేదు.

విభజనలొ రాజకీయ నాయకుల ప్రమేయం ఏ మాత్రం లేనట్లు ఎవరిదారిన వారుంటే... ఇదేదో బ్యూరోక్రాటిక్ దేశంలాగా ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా  ఇరు రాష్ట్రాల ఆస్తులనీ పంచుతున్నారు. నాయకులు ఎన్నికలు వస్తున్నాయి అని అనగానే ఎంతో ఉత్తేజంగా, నడవలేని ముసలి నాయకులు కూడా పరిగెడుతూ పాల్గొన్నవారు, విభజన కర్యక్రమంలో మడుకూ పాల్గొనటం లేదు. అదేదో ఉద్యోగుల విషయం అన్నట్లుగా మిన్నుకుండిపొయ్యారు.    

ఎన్నికలు ఇప్పుడోచ్చేవే కాకుండా... రాబోయ్యే 2019 న్నికల ప్రణాలికలని కూడా తయారు చేసుకునేంత దూర దృష్టికల మన రాజకీయ నాయకులు... రాష్ట్ర విభజన సందర్భంగా ఆస్తుల పంపకం జరుగుతున్నప్పుడు...రాజధానిలో కూర్చుని పరిశీలించాలి.  కాని, వీరికి ఆ భాధ్యత ఉన్నట్లు కనపడటం లేదు. "ఆ... ఎన్నికల తరవాత ఎవడు వస్తోడో మనకెందుకొచ్చిన గొడవ" అన్నట్లుగానే ఉన్నారు కాని... ప్రజల ఆస్తుల పంపిణీ జరుగుతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఈ విషయంలో తెలంగాణా నాయకులే కొద్దిగా నయమనిపిస్తున్నారు. అయితే వారు కూడా ఫాం హౌసులకి పరిమితం కావటమో లేక వారికి తాట తీస్తాం వీరికి నాలిక కోస్తాం అనే మాటలతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. కేవలం ఉద్యోగుల విషయం తప్ప మరే దాని మీద ప్రకటనలు చెయ్యటం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ నాయకులకైతే ప్రజలంటే ఎన్నికలుగానే కనిపిస్తోంది కానీ బాధ్య్తగా అని అనిపించటం లేదు...ఎన్నికల రణరంగలో పాల్గొన్న వీరు... ఎన్నికలు అయిపోగానే రాజధానిలో ఒక కమిటీ క్రింద ఏర్పడి రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో భాగం పంచుకోవలసిందిపోయి... ఎవరిదారిన వారు హాలిడే రిసార్టులకీ...ఫాం హౌసులకీ వెళ్ళిపోయ్యారు. రేపు ఈ నాయకులే వచ్చి ఉద్యోగులు చేసిన విభజన పాపాన్ని రెచ్చగొట్టి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సయోధ్యలేకుండా చేస్తారు...అదేదో ఇప్పుడే అన్ని పక్షాలు కలిసి కూర్చుంటే తరవాతి కాలంలో అనవసర వివాదాలుండవు కదా...!!!


ప్రజాసామ్యం...???

ప్రజాసామ్యంలో, ప్రజల ఆస్తులని పంచటానికి ఉద్యోగులు ఎవరు...? పరాయి రాష్ట్రం నుండి వచ్చిన అధికారులు ఎవరు...??? "దీని వలన కాగితాల మీద లెక్కలు బాగానే కుదరొచ్చునేమో కానీ, నేల మీద లెక్కలు గొడవలకి దారి తీస్తాయి"...ఉదాహరణకి అనేక విషయాలని జనాభ ప్రతిపాదికగా తీసుకుంటూ... కరెంటు పంపిణీని వాడకం[వినియోగం]ప్రతిపాదికని తీసుకోవటం చూస్తే ఉద్యోగుల అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. అంటే, ఎవరి దగ్గరైనా... వాడని డబ్బుని ఇతరులకి పంచి వెయ్యచ్చునా... మరి అసలు వ్యక్తికి అవసరం పడితే... సీమాధ్రలో వినియోగం లేదని కరెంటుని తగ్గిస్తే... అసలే పరిశ్రమలు తక్కువ. మరి కొత్తగా పరిశ్రమలు వస్తే ఏమి చెయ్యాలి...???

అలాగే, కేవలం 10 యేళ్ళ రాజధాని అంటున్నారు.  మరి హైదరాబాదులోని అనేక భవనాలని పంచటం దేనికి... కొన్నిటిని విరగ్గోసి కట్టిస్తో అనవసర ఖర్చు దేనికి... అదేదో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబొయ్యే రాజధానిలోనే ఖర్చు పెట్టవచ్చును కదా.... ఈ లోగా కలిసి కాపురం చేస్తే, ఇంతలో కొంపలేమి ముణిగిపోవు కదా...ఇది విడిపోవటం రాష్ట్రంగానే కాని... దేశంగా కాదు కదా... ఇందులో కూడా ఉద్యోగుల-అధికారుల కాగితం తెలివితేటలు కనపడుతున్నాయి.

అసలే ఈ ఉద్యోగులు వాళ్ళలో వాళ్ళకి సయోధ్య లేక, 
ఎవరు ఎక్కడికి పోవాలో తెలియక ఆందోళనలు చేస్తూ...
ఆందోళనగా ఉన్నప్పుడు, 
వారు ఇంత పెద్ద రాష్ట్రం ఆస్తులని 
ఎలా ప్రశాంతంగా చక్కగా లెక్కించి విభజింపగలరు..? 
ఆ విభజనలో 
వారి వారి లాభ నష్టాలని కూడా పరిగణలోనికి తీసుకుంటే... 
అప్పుడు ఆయా పరిధిలో ఉన్న ప్రజలకి 
తీరని నష్టం కలిగించినట్లే కదా... 
అంటే ఆస్తుల పంపిణీ చేస్తున్నప్పుడు 
ఆయా ఉద్యోగులకి ఏది లాభసాటిగా ఉంటుందో
[తమ 5 లేక 10 సంవత్సరాల సర్వీసు కోసం]
అలా పంపిణీ చేసే ప్రలోభం వారిలో ఉన్నప్పుడు... 
వారి చేతే లెక్కలు తీయించటం ప్రమాదకరం కాదా...??? 
తొందరపాటు విభజన విభేధాలకి మూలం అవుతుంది.

దీనంతటికీ మూలం, 
రాజధానిని చూపించకుండా విభజించటమే... 
ఇది బాధ్యతా రహితంగా జరిగింది... 
దీని గురించి ఇది వరలో ఇదే బ్లాగులో సూచించటం జరిగింది.
సామాన్య ప్రజలకే తెలుస్తున్నాప్పుడు... 
వేలు లక్షలు జీతాలు తీసుకొనే ఉద్యోగులకీ తెలియదా...??? 
వంశపారంపర్యంగా ప్ప్రజాసేవ చేస్తున్నామని 
చెప్పుకునే రాజకీయ ప్రముఖలకి తెలియదా
 అని అనటం కూడా జరిగింది... 
అయితే,  
ప్రజల గోడు అరణ్యరోదనే అయ్యిందే కానీ... 
 అటు రాజకీయనాయకులకి గానీ
ఇటు ఉద్యోగులకి కానీ...
బుద్ధి వికశించినట్లు కనపడలేదు....

 వేలల్లో నాయకులకి 
ఫ్రెష్‌గా వచ్చిన ఎన్నికలు ముఖ్యంకాగా...
లక్షలలో ఉన్న ఉద్యోగులకి 
తమ సర్వీసు...
పెన్షనే పరమావధి అయ్యిందే కానీ, 
కోట్లలో ఉన్న ప్రజల గోడు 
ఎవరికీ పట్టటంలేదు. 



కాబట్టి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని...
ముందరగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించి 
సాధ్యమైనంత తొందరగా 
అంటే 10 సంవత్సరాలకంటే ముందరే 
దానిలోనికి మారేట్లుగా 
ప్రణాలికని తయారు చెయ్యాలి.
అటు తమ రాజకీయ భవిష్యత్తు అని 
రాజకీయ నాయకులు స్వార్ధంగా ఆలోచించ కుండా...
ఇటు ఉద్యోగులు తమ 5, 10 సంవత్సరాల సర్వీసులు గురించి కాకుండా... 
ప్రజలకి శాశ్వతంగా మిగిలిపోయ్యే విషయాలపట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. 
లేకపోతే విడిపోయి అన్నదమ్ములుగా ఉందాము అన్నమాట అటుంచి...
కనీసం ఇరుగు పొరుగు వారిలా కూడా ప్రజలు ఉండక, 
రెండు శత్రు దేశాల్లా నిత్యం కొట్టుకునే పరిస్తితి వస్తుంది.... 
నాయకులారా...సామాజిక సేవకులారా
 ఇకనైనా కళ్ళు తెరిచి విభజన ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గోనండి... 

ఇది అయిదేళ్ళకొకసారి వచ్చే 

ఎన్నికలకన్నా ముఖ్యమైనది... 
ఎన్నికలలో తప్పు నిర్ణయం తీసుకుంటే 
మరో అయిదేళ్ళలో మార్చుకోవచ్చును... 
కానీ,
ఇప్పుడు జరిగే
విభజన ప్రక్రియ ఫలితం 
శాశ్వతం.


ప్రజాసామ్యం పై అత్యంత గౌరవంతో[?]
ఓటు వెయ్యకపోతే వుతారు ఇదవుతారు అనే మీడియా కూడా 
విభజన అంటే అదేదో ఉద్యోగులకి సంబంధించినదిగా చూస్తున్నదే కానీ,
ఈ విషయం మీద సరైన అవగాహనతో మెలగటం లేదు...
విభజన విషయాలపై సరిగా చర్చించటం లేదు...  
ఇది రాజకీయ నాయకుల-పార్టీల భవిష్యత్తు కాదు కదా...
ప్రజలది కదా... ఎవడికి పట్టింది....!!!


జై హింద్


బొమ్మలు గూగుల్-మిక్సింగ్ కేఆర్కే 



@@@@@<><><><><><><>@@@@@


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



8, మే 2014, గురువారం

సరి లేరు మీకెవ్వరూ....


హమ్మయ్య. ఎన్నికలు అయిపొయినాయి. 
ఇంకొ అయిదేళ్ళ దాకా రావు. 
రాకూడదు కూడా... 
ప్రజా సేవ చెయ్యటానికి రాజకీయ నాయకులు 
పొటాపోటీగా ఎగబడి ఎన్నికలలో పాల్'కొన్నారు
ఇంతగా ప్రజా సేవ చెయ్యటానికి ఎగబడే రాజకీయ నాయకులని 
మరే దేశంలోనూ కూడా చూడలేము. 
ఆ మాటకొస్తె పురాణాలలో కూడా చూడలేదు. 
ఆహా ప్రజలంటే నాయకులకి ఎంత ప్రేమ...! 

ప్రజలకి సేవ చెయ్యటానికి తాము పుట్టి పెరిగిన రాజకీయ పార్టీలనే ఒదులుకుని త్యాగాలు చేశారు. కొత్త పార్టీలనే ఎంతో శ్రమకోర్చి కొంత మంది పెట్టారు.  అంత స్తోమత లేని వారు ఏ పార్టీలో  చేరితే గ్యారంటీగా గెలుస్తామో ఆ పార్టీలోనికి రానిచ్చినా, రానియ్యకపొయినా...బలవంతంగానైనా దూరి ప్రజలకి దగ్గరవ్వాలని మన నాయకులు చేసిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా హర్షించి తీరాలిసిందే...

ఇక వారు గెలిచి ఆ ప్రాంతపు అభివృద్ధిలో భాగం పంచు' కోవటానికి{?} అప్పటిదాకా ఎవరిని తిట్టారో వారినే మెచ్చుకుని...ఎవరిని వెనకేసుకుని వచ్చారో వారినే ఎండగట్టి; తమలో తాము కుమ్ములాడుకుని అయినా సరే ప్రజా సేవయే తమ తక్షణ కర్తవ్యమని నమ్మినారు మన రాజకీయ నాయకులు. ఇంతే కాదు...తమ పార్టీలనే కాకుండా తమ సంపదని కూడా కొందరి ప్రజల కోసం త్యాగం చెయ్యటానికి వెనుదియ్యలేదు. "ఇలా సంపదని త్యాగం చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ నాయకులే ముందర ఉన్నారని ఎలక్షన్ కమీషన్ వారు కూడా ఎలక్షన్లు అయిపోగానే ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు"...!!!

ప్రజల కోసం ఏమైనా చెయ్యటానికి వెనుదియ్యని మన రాజకీయ నాయకులు కౌన్సిలర్ దగ్గర నుండీ ఎంపీల వరకూ తమ స్తాయిని కూడా మర్చేపోయి ప్రజల కోసం తాము చెయ్యబొయ్యే అభివృద్ధి పనులకోసం వేలకోట్ల రూపాయలు ఎలాగైనా తెచ్చి అభివృద్ధి చేస్తామని మాటలు ఇచ్చేస్తున్నారు.  ఒకరు అర్ధ రూపాయకే కిలో బియ్యం ఇచ్చేస్తుంటే, ఇంకొకరు సింగప్పుర్ చెసేస్తామంటున్నారు... మరొకరు కేవలం వంద రూపాయలకే నెల కరెంటుని ఇచ్చేస్తామని చెపుతున్నారు.  ఇది అన్నిటికన్నా అద్భుతమైన విషయం. ఎందుకంటే వీరు ఒక్కో నియోజక వర్గానికి చెయ్యబొయ్యే అభివృద్ధి పనుల విలువ అనేక చిన్న దేశాల సంవత్సరం బడ్జెట్టు విలువ అంత ఉండటమే. ఇది మన రాజకీయ నాయకులకి కాక మరింకెవరికి సాధ్యం...!!! స్వంత ప్రజల మీద భారం వెయ్యకుండానే ఇంత డబ్బుని ఎక్కడి నుండీ తేస్తారో...బహుశా ఇతర దేశాల మీద దాడి చేస్తారేమో...ఈ డబ్బు కోసం.

ఇంతలాగా ప్రజల గురించి మాత్రమే ఆలోచించే వారు మరెక్కడైనా ఉంటారా...? కేవలం ప్రజల కోసమే తమ పరువు ప్రతిష్టలనే కాకుండా తమ మనస్సాక్షిని కూడా చంపుకుని ఇష్టం లేని వారితో కూడా చేతులు కలిపి ప్రజలకి సేవ చెయ్యటానికి ముందుకొచ్చారంటే మన రాజకీయ నాయకుల గొప్పతనం మరింకెవరికైనా ఉంటుందా...??  తామూ కనుక అధికారం లోనికి రాకపొతే తమ ప్రజలు ఏమైపొతారో అన్న ప్రేమతో కూడిన భయం వీరిలో ఉన్నట్లుగా...కన్న తల్లిదండ్రులలో కూడా కనపడదు.

ఇంతే కాదు వీరి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నది... కానీ, ఇంత త్యాగాలు ప్రజల కోసం చేసినా ఎందుకో వీరంటే ప్రజలలో చులకన భావం ఉన్నది. ఎందుకు ఇంత చులకన భావం...???? ఎన్నో త్యాగాలు చేసి అధికారంలోనికి వచ్చిన నాయకులు పెంచిన రవాణా చార్జీలనీ, కరెంటు చార్జీలనీ, నిత్యావసర ధరలనీ భరించి ప్రజలు కూడా త్యాగాలు చెయ్యాలని కోరి... తాము మాత్రం రాచరిక హోదాల్లో అన్నీ ఉచితంగా పొందటం వల్లనా...?? లేక, ప్రజలు నానా కష్టాలు పడి 30, 40 ఏళ్ళలో సంపాయించలేనంత సంపదని రాజకీయ నాయకులు కేవలం అయిదేళ్ళ ప్రజాసేవలో సంపాయిస్తున్నారనా...?

ఇంతమాత్రానికేనా, నాయకులు కేవలం తాము రావటమే కాదు...తమ వారైన కొడుకుల్నీ, కూతుళ్ళనీ, కొడళ్ళనీ, అళ్ళుళ్ళనీ... ఇలా ఒకరేమిటీ పెద్దవారి ఆత్మలతో సహా...కుటుంబాలకి కుటుంబాలే ప్రజాసేవ నిమిత్తం ఎండనకా... వాననకా రొడ్డున పడుతున్నప్పుడూ కొన్ని సౌకర్యాలని పొందితే ఏమిటటా...? సంపాదన మాటా; ఆ మాత్రం లేకపొతే వారికి రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది.  ఇదేమన్నా నెలవారీ గ్యారంటీ ఉద్యోగమా 30 ఏళ్ళపాటూ నెల తిరిగేప్పటికి జీతం రావటానికి... అయిదేళ్ళు; అదీ కూడా గ్యారంటీ లేదు. ఆ తరవాత వాళ్ళ  పరిస్తితి ఏమిటో... "వారు అయిదేళ్ళలో సంపాయించిన విధానానికి...తిరిగి వారే అధికారంలోనికి రావటం తప్పనిసరి కదా...పులి మీద స్వారీ"... ప్రజల కోసం ఇంత చేస్తున్న మన నాయకులకి సరితూగగల వారు ఎవరన్నా ఉన్నారా... ?!?!?!?  


కొసమెరుపేమంటే, 
అధికారం కోసం నానా కష్టాలు పడినట్లుగా భావించిన నాయకులలో 
దేశం విడిచి వెళ్ళగలిగిన నాయకుడు 
దేశం విడిచి హాలిడే రిసార్టులకి వెళ్ళగా.... 
దేశం విడవటం కుదరని మరో నాయకుడు 
దేశీయ హాలిడే రిసార్టుకి వెళ్ళిపోయ్యాడు... 
కానీ, 
ఈ నాయకులు 
ఎన్నికల సందర్భంగా రగిల్చిన చిచ్చులో పడి
 ఆయా పార్టీల కార్యకర్తలు కొట్టుకుని చస్తున్నారు.
 వీరికి ఏ హాలిడే రిసార్టులు లేవు. 
ఇదే ప'రాజ సామ్యం..!!!!!!!!!
[11-5-14]





జై హింద్

బొమ్మ గూగుల్ ప్రసాదమే...మిక్సింగ్ కేఆర్కే