LOCAL WEATHER

27, జనవరి 2013, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్యులు జన్మించిన స్థలం "కాలెడి" ఫోటోలు

 సంక్రాంతి పండగ ముందు శబరిమలై యాత్రకి  వెళ్ళటం జరిగింది.  ఈ సందర్భంగా  ఎర్నాకులం నుండి షుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న [లింకు నొక్కండి] "కాలెడి" చూడటం జరిగింది. ఇక్కడే  శ్రీ ఆది శంకరాచార్యులు పుట్టిన స్థలంలో ఉన్న ఆశ్రమాన్ని చూసాము. అది ఎంతో ప్రశాంతంగా  ఉన్నది. అక్కడి ఫోటోలు.........

 హిందూమతాన్ని  రక్షించిన శ్రీ ఆది శంకరాచార్యులు వారు  




ఇక్కడ ఉన్న నది ఒడ్డున స్నానాల ఘాట్ వద్ద గోడ మీద ఉన్న చక్కటి బొమ్మలు.










 శ్రీ ఆది శంకరాచాయుల కీర్తి స్తూపం 




కాలెడి  ఆలయం దగ్గర ఉన్న  శ్రీ కృష్ణని చిత్రం  


చివరగా శ్రీకృష్ణ  ఆలయంలోని కైరళి ద్వని 



@@@@@@

20, జనవరి 2013, ఆదివారం

"మాయారోగాలు" ఎందుకు వస్తాయి...???


****************************************************************************
ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మమే మనని  కాపాడుతుంది
 
ధర్మాన్ని అతిక్రమిస్తే  "అధర్మ రోగాన"  పడవలసి ఉంటుంది 
*****************************************************************

మాములుగా సామాన్యులకి వారి వారి తిండీ తిప్పల అలవాట్ల వలన రోగాలు వస్తాయి. అంటే తినగూడనవి తింటే, తినాలిసిన దానికన్నా ఎక్కువ తింటే రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే తిండి కోసం పడే తిప్పలు వలన కూడా రోగాలు వస్తాయి... ఎలాగంటే... చెయ్య వలసిన పనులు చెయ్యకపోయినా, చెయ్యవలసిన దానికన్నా ఎక్కువ చేసినా రోగాలకి మనం ఆహ్వానం పలికినట్లే...... అయితే,  ఈ సామాన్యులకి ఎట్టి పరిస్థితిలోనూ "మాయారోగాలు" వచ్చే అవకాశం చాలా తక్కువ.  

ఇకపోతే బాగా డబ్బున్న వాళ్ళకి రోగాలు డబ్బు టెంక్షను వల్లనా.......ఆ డబ్బును అపసవ్యంగా ఖర్చు పెట్టే పిల్లల వల్లనా, ఆ డబ్బును లెక్కలేకుండా ఎక్కడ పడితే అక్కడ దాచటం వల్లనా, అవి లెక్క తేలకపోవటం వల్లనా, లేక ఆ డబ్బును ఎవరో కొట్టేస్తారన్న భయం వల్లనా వస్తాయి. వీరు డబ్బు విషయంలో మరింత వ్యధ చెందితే వీరు "మాయారోగానికి" గురవుతారు.   

ఇకపోతే, కొందరికి నోటి దూల వల్లన రోగాలు వస్తాయి.....అంటే అవేశంతో ఎదో అనేసినా, అవసరం కన్నా ఎక్కువ వాగినా, అహంకారంతో తమ అవసరాలకి జనాలని వాడుకునేందుకు వారితో అనకూడని మాటలు అనేసినా లేక చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకుని ఆ కావరంతో వాగినా ఎక్కడలేనీ మాయరోగాలు చుట్టుముడతాయి.  

పైన చెప్పిన రెండు రకాల వారికీ అంటే సామాన్యులకీ, బాగా డబ్బున్న వారికీ వచ్చే రోగాలని కనిపెట్టటానికి చాలా సాధనాలు ఉన్నాయి. వాటి ద్వారా రోగ మూలాలని కనిపెట్టి అవి ఉపశమించటానికి మందులు ఇవ్వగలుగుతారు మన డాక్టర్లు......వీటీలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేరోగాలుంటాయి, వాటికి పై రొండు తరగతుల వారికీ మందులుంటాయి.

సరే, మనం ముఖ్యంగా మూడో తరగతికి చెందిన నోటి దూల వల్లన వచ్చిన మాయా రోగుల గురించి చెప్పుకోవలసి ఉన్నది. వీరికి ముఖ్యంగా వంశపారంపర్యంగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటు వ్యాధి వల్లన కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ అంటు వ్యాధి కేవలం దగ్గరున్నప్పుడే కాదు, శబ్ద తరంగాల వలన కూడా వ్యాపిస్తుంది. రోగులని పరీక్ష చెయ్యటానికి ఇవ్వాళ ఎన్నో పరికరాలు ఉన్నప్పటికీ, ఆ పరికరాలలో ఈ జబ్బు కనపడదు. ఇది కేవలం ఆ జబ్బు వచ్చిన వ్యక్తికి మాత్రమూ తెలుస్తుంది.  ఈ వ్యక్తులు దూల కొద్దీ మాట్లాడినప్పుడు చట్టం తన పని అది చేసుకుపోయినప్పుడు ఆయా వ్యక్తులలోని మాయారోగాలన్నీ బయటకి వచ్చి వారిని ఆందోళనకి గురిచేసి భయాందోళనలని కలగ చేస్తాయి. ఈ వ్యక్తులు యొక్క మాయా రోగం బయటకి రావటానికి కారకులు "చట్ట పరిరక్షకులు". ఈ చట్ట పరి రక్షకులని చూసిన కొద్దీ ఈ దూల రోగ వ్యక్తుల మాయారోగం మరింత ప్రకోపిస్తుంది. ఈ రోగానికి విరుగుడు కానీ మందు కానీ లేదు.....ఈ మాయా రోగం ఉపశమించటానికి ఒకే ఒక్క కాల పరిమితి గల మందుంది.....అయితే ఈ మందును చట్ట పరి రక్షకులు మాత్రమే  ఇవ్వగలరు.  ఆ మందు పేరే  "బెయిలు".............!!!


ఈ మాయా రోగం వచ్చిన తరగాత మందు లేకపోయినప్పటికీ....అసలు రాకుండా చెయ్యటానికి  చక్కటి మందుంది.......... అదే "భగవత్ గీత".  ఎవరైతే భగవత్ గీతను చదివి అందులో చెప్పిన విధంగా ధర్మాన్ని పాటిస్తారో వారికి పైన చెప్పిన మాయారోగం ఎప్పటికీ వచ్చే అవకాశం లేదు. ఈ భగవత్ గీతను ఎవరు ఆస్వాదించరో వారికి పైన చెప్పిన మాయారోగం వచ్చే అవకాశం ఉన్నది...ఈ  భగవత్ గీత కేవలం ఒక మతానికే కాదు,  అన్ని మతాల వారికీ .......ఇదే విధమైన భగవత్ గీత  వారి వారి మత గ్రంధాలలో లభిస్తుంది.          

 @@@@


5, జనవరి 2013, శనివారం

హైదరాబాదు పిచ్చోడి వాగుడుకి 2 వేల రూపాయల పెద్ద మనిషి కోరిక తీరలేదు.....!!!



పాపం 2000/- రూపాయల పెద్దమనిషి కోరిక తీరలేదు. భారత దేశలో మతకల్లోలం సృష్టించాలి అంటే కేవలం రెండు వేలుంటే చాలు అని పిచ్చి వాగుడు వాగిన పెద్ద పదవిలో ఉన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏ నోటితో దేశ ప్రజలకి క్షమాపణ చెపుటాడు...?? ఎందుకంటే హైదరాబాదు పిచ్చోడు వాగిన వాగుడికి ఈ పాటికి ఏ పాకిస్తానులో కానీ, విపరీత స్వతంత్రం ఉన్న అమెరికాలో కానీ అయితే విపరీత అల్లర్లు జరిగేవి.... కానీ, మన దేశంలో అలా జరగలేదు.   దేశ ప్రజలందరినీ తూలనాడిన ఈ మనిషి లాంటి వారి దగ్గర చట్టం తనపని తాను చేసుకోకపోవటం  వల్లనే ఈ రోజున  హైదరాబాదు ఉన్మాది లాంటి పనికిమాలిన వారికి ప్రొత్సాహం లభించినట్లైంది.

ఇది వరకూ వ్రాసిన పోస్టు "తిరుమల భద్రత.......ఇల్లెక్కి కూయాలా...???" లో రామ జఠలమలాని వాగిన వాగుడు గురించి ప్రస్తావించటం జరిగింది.  ఆ రోజున రాముడి పేరే పెట్టుకొన్న ఈ పెద్దమనిషి పిచ్చివాడులా వాగుతుంటే వారించిన వారు లేరు. రాముడిని నిందించినందుకు ఇతగాడిపైన ఎటువంటి కేసు పెట్టలేదు... ఇదే అలుసైంది వాళ్ళకి. రాంజఠల్మలానీ మాటలనే ప్రాతిపదికగా చేసుకొని హైదరాబాదు పిచ్చోడు తెగ ఎగిరాడు...వెనుకాల తోడేళ్ళ నవ్వుల మధ్యన. ఇలాంటి పనికిమాలిన వాళ్ళకి ఊతం ఇచ్చింది రాంజఠల్మలానీ కాదా...? మరి అతని మీద ఎందుకు కేసు పెట్టరు...?

ఇదే విధంగా అరవవాళ్ళ నెల్లూరి ముసలాయన రాముడి గురించి వెర్రి వాగుడు వాగినా ఎవరూ ఆయనను వారించలేదు.... ఈయన సినిమాలకి డైలాగులు వ్రాసి మరీ మంత్రి అయిన వ్యక్తి కదా ఎలా వాగినా పరవాలేదని ఆయన అనుకుని ఉండచ్చు.... ఎందుకంటే మన దేశీయ సినిమాలలో హిందూ దేవుళ్ళని ఎంత వ్యంగం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే... ఇలాంటి అవమానకరమైన పనిచేసిన వారిని ముందర నుండీ "చట్టం ఒక చూపు చూసుంటే" ఎటువంటి ఉన్మాదులకీ అవకాశం లభించేది కాదు. కానీ ఇలాంటి విషయాల పట్ల ఏనాడూ శ్రద్ద వహించలేదు.  

సమస్య చిన్నదిగానే ఉన్నప్పుడు కనుక సకాలంలో వారించినట్లైతే అది పెద్ద సమస్యగా రూపొందదు.  కానీ  ఈ రోజున సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది........ఇప్పుడే కనుక అదుపు చేయ్యకపోతే తరవాత రోజులలో చెయ్య దాటిపొయ్యే అవకాశం ఉన్నది. శిక్షా స్మృతిలో ఉన్నట్లుగా.....  ఒకడు నేరం చేస్తే ఆ నేరాన్ని ప్రొత్సాహించిన వాళ్ళూ, సమర్ధించిన వాళ్ళూ, దారి చూపి నేరాన్ని చేయించిన వాళ్ళు కూడా దోషులే....!!! ఇలా కనుక పైన చెప్పిన పెద్ద మనుషుల మీద చట్టం తన పని తాను చేసినట్లయితే  ఈ రోజున దేశానికి "చీడలాంటి" వారి గురించి మనం ప్రస్తావించాలిసిన అవసరం ఉండేది కాదు....!!! 

చివరగా,  హైదరాబాదు ఉన్మాది వ్యాఖ్యలు వలన హిందువుల మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయో,  అలాగే ముస్లింస్‌లో అనేక మందికి ఇబ్బందికరంగా తయారైనాయి....  ఒకే దేశంలో ఉంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా బ్రతకటం చాలా కష్టం అన్న సంగతి ఈ ఎంఎల్ఏకి తెలియదా.... తనదాకా వస్తే వేరే మతం అమ్మాయిని పెళ్ళి చేసుకొన్న వ్యక్తి[ఒక టీవీ చర్చలో నన్నపనేని రాజకుమారిగారు చెప్పిన మాటల ఆధారంగా], మిగిలిన వారిని రెచ్చగొట్టటం చూస్తే ఆ వ్యక్తిలో మతం కన్న రాజకీయ కుళ్ళు కంపే కొడుతోంది.....!!!     


@@@@@@@@@@


కర్టేసి వికిపిడియా-గూగుల్ ఇమేజస్