LOCAL WEATHER

1, ఆగస్టు 2014, శుక్రవారం

రాజధాని మధ్యలోనే ఉండి తీరాలా...కర్నూలు, విశాఖలు పనికిరావా...???

ఈ మధ్యన, విడిపోయి "రాజధానిని పోగొట్టుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలి" అనే విపరీత చర్చలు జరిపోతున్నాయి....ఈ చర్చలాగ్నికి మన మీడియాలు చాలా చక్కగా ఆజ్యం పోస్తూ తమ రేటింగుని పెంచుకుంటున్నాయి.... ఈ చర్చలకి అసలు కారణం "రాజధాని ఎక్కడ" అని బాధ్యత కలిగిన మన నాయకులు ప్రకటించకపోవటమే... ఇప్పటికే విజయవాడ మరియూ గుంటూరుల మధ్యే రాజధాని అని చెప్పకనే చెపుతూ ... మరల ఆ మాట మీద నిలబడటం లేదు... దానితో నిమ్మదిగా "రాజధాని ఎక్కడ పెట్టాలీ అనే విషయంపై ... సమైక్యాంద్రులలో అనైక్యత మొదలైయ్యింది...

మన వాళ్లకి ఇతరుల విషయంలో విశాల హృదయం ఎక్కువే...ఇది ఇతరుల రాజధానులు కట్టటంలో ఉన్నట్లుగా ... మన రాజధాని విషయంలో కనపడటం లేదు. దీని వల్లనే ఎవరి పంతం వారిదిగా చర్చిస్తున్నారే గాని, "ఇది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుందా" అని ఆలోచించటం లేదు. వీరి వాదనలు ఎలా ఉన్నా కర్నూలు విశాఖలో మాత్రం రాజధాని పెట్టటం సమంజసం కాదు... అలాగని ఏ విజయవాడలోనో పెట్టమని కాదు... దీని గురించి [లింకు నొక్కండి] "సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు...?!?!?" అని ఈ బ్లాగులోనే అయిదు నెలల క్రిందటే సూచించటం జరిగింది.  

ఈ చర్చల విషయానికొస్తే, 
ఇంతకు ముందు కర్నూలు ఉంది కాబట్టి అక్కడే పెట్టాలని ఒకరూ, 
మరొకరు విశాఖలో పెట్టాలనీ....
కాదు కాదు అందరికీ మధ్యలో ఉంది కాబట్టి 
విజయవాడా గుంటూరుల మధ్యే పెట్టాలనీ మరికొందరూ అంటున్నారు.... 
మధ్యలో పెట్టాలి అనే వారి వాదనను వ్యతిరేకించే వారు 
మధ్యలోనే రాజధాని ఎందుకని ఉండాలీ...
తమిళనాడుకి, మహారాష్ట్రకీ, వెస్టుబెంగాలుకీ 
రాజధానులు మధ్యలో ఉన్నాయా...
అమెరికా రాజధాని ఓ ప్రక్కన లేదా, 
అంత దాకా ఎందుకూ "మన దేశ రాజధాని మధ్యలో ఉన్నదా"?
 అని కొందరు ప్రశ్నిస్తున్నారు...
చరిత్ర తెలియకపోవటం వల్లనే
ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి.
ఏదైనా దేశానికి గానీ, 
రాష్ట్రాలకి గానీ రాజధానులు మధ్యలోనే ఉండటమే జరుగుతోంది. 
ఒక వేళ అలా లేకపొతే 
వాటికి మూడు కారణాలు కనపడుతున్నాయి:


1] భౌగోళికమైనది 
2] ఆక్రమణలకి గురైన ప్రాంతం  
3] రాష్ట్ర విభజనలు/కలయికలు


1]భౌగోళికమైనది: 

ఈ కారణం తీసుకుంటే... ఇలా ప్రక్కగా రాజధానులు ఉన్న రాష్ట్రాలలో అక్కడి భౌగోళికమైన పరిస్థితులే కారణంగా కనపడతాయి. రాష్ట్రంలో విపరీతంగా పర్వతాలూ, అడవులు, ఎడారులూ కనుక ఉంటే, అలాంటి రాష్ట్రాలలో మాత్రమే రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నాయి...రాజస్థాన్, అరుణాచలప్రదేశ్, ఝార్ఖండ్, హిమచలప్రదేశ్, త్రిపురా లాంటి 8 రాష్ట్రాలున్నాయి. వీటిలో 6 రాష్ట్రాలు దాకా కొత్తగా ఏర్పడినా...అక్కడున్న భోగోళిక పరిస్తితుల వలన మధ్యలో రాజధానులు రాలేదు.  ఉదాహరణకి...

పడమర ప్రాంతమంతా ఎడారిగా ఉన్న రాజస్థానులో 
జైపురు ఉత్తరంగా ఉన్నప్పటికీ, 
ఎడారిలేని ప్రాంతాలకి మాత్రం మధ్యలోనే ఉన్నది.
రాజధాని మధ్యలో లేకపోయినా, ఎడారికి దూరంగా జనాలకి దగ్గరగా ఉన్నది.  

అలాగే, 
హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌నకు 
డెహ్రాడూన్ పడమరగా ఉన్నప్పటికీ...
ఎక్కువ జన సమర్ధంగల అన్ని ప్రాంతాలకీ అందుబాటులోనే ఉన్నది.
పర్వతాల వలన ప్రక్కన ఉండాలిసి వచ్చిన ఉత్తరాఖండ్ రాజధాని 


2]క్రమణలకి గురైప్రాంతం: 


ఇది ఒకరకంగా చారిత్రాత్మకమైనది...ఇందులో బయటివారి ఆక్రమణల నేపధ్యం ఇమిడి ఉన్నది... 
ఇది రాష్ట్రాలకి, దేశాలకీ సంబంధించినది. 

ఉదాహరణకి అమెరికా తీసుకుంటే...
యూరోపియన్లు చేరుకుని 
మొదలు ఆక్రమించినది అమెరికాలోని తూర్పు ప్రాంతమే... 
మొదటగా స్వతంత్రం ప్రకటించుకున్నది కూడా అదే ప్రాంతం. 
ఈ క్రమంలోనే అమెరికాకి తూర్పున ఉన్న 
వాషింగ్‌టన్ ప్రాంతం... రాజధాని అయినది...
ఇందులో ఇంకో విషయం ఏమంటే 
ఇప్పుడు కనపడే యూ.ఎస్.ఏ రావటానికి చాలా దశాబ్దాలు పట్టింది...
దానికి ముందరే వాషింగ్‌టన్ రాజధానిగా ఉన్నది కాబట్టి, 
దానిని అలాగే ఉంచారు...
అదీకాక, తరవాత కలిసిన పశ్చిమంలో ఎక్కువ  భాగంలో ఎడారే...
అప్పుడున్న అమెరికాకి రాజధాని మధ్యనే ఉన్నది.

 మరొక ఉదాహరణలో 
మన దేశాన్ని ఈస్టు ఇండియా/బ్రిటీషువారు ఆక్రమించినది కలకత్తా వైపు నుండే...
కాబట్టి కలకత్తా 1911 సంవత్సరం వరకూ రాజధానిగా ఉంచారు... 
తరవాతి కాలంలో దేశం మొత్తానికీ అందుబాటులో లేదనీ 
మరియూ తూర్పు నుండీ యుద్ధ భయంతో, 
తమ రాజధానిని ఢిల్లీకి మార్చారు.... 
అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లోని కొంత భాగం, పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్ లు 
బ్రిటీష్ ఇండియాలో కలిసి ఉండేవి...
ఆ మొత్తం ప్రదేశాలకి ఢిల్లీ మధ్యలోనే ఉన్నది.
అఖండ  భారత్‌కు మధ్యలొనే ఉన్న ఢిల్లి

అలాగే రష్యాకి మాస్కో  రాజధానిగా మధ్యలోనే ఉన్నది... అయితే తరవాతి కాలంలో వారు ఆక్రమించిన ఆసియా దేశాలు కలిసిన తరవాత రాజధాని ఆ దేశంలో పడమరగా ఉన్నట్లుగా అయ్యింది. బ్రిటీషువారి రాజధాని లండనుదీ ఇదే చరిత్ర. నిజానికి ఇంగ్లాండ్ మరియూ వేల్స్ కలిపి మాత్రమే ఇంగ్లిషు రాజ్యంగా ఉండేది...తరవాత స్కాట్లేండునీ, ఐర్లాండునీ ఆక్రమించటంతో ఆ దేశ రాజధాని కూడా ఓ ప్రక్కగా ఉన్నట్లు అయ్యింది...


అలాగే, పంజాబు రాజధాని లాహోర్ ఒకప్పుడు మధ్యలో ఉండేది...
అయితే, 
దేశ విభజన సందర్భంగా పంజాబ్ రెండు ముక్కలుగా అయి...
ఒకటి భారత్ లో మిగలగా...
రెండవది పాకిస్తాన్ లోనికి వెళ్ళింది... 
పాకిస్తాన్ లో ఉన్న పంజాబుకి లాహోర్ రాజధాని అయినప్పటికీ...
అది ఆ రాష్ట్రం తూర్పు దిక్కున భారత సరిహద్దులో ఉన్నది.


ఒకప్పటి కాశ్మీరుకు శ్రీనగర్ మధ్యలోనే ఉన్నది...
ఆక్రమణలకి గురై 
మిగిలిన కాశ్మీరుకి ప్రక్కన రాజధాని అయ్యింది.


3] రాష్ట్ర విభజనలు/కలయికలు

అంటే... ఏదైతే ఇప్పుడు రాజధాని ఒక మూలగా ఉన్నదో, ఆ రాజధాని ఒకప్పుడు మధ్యలోనే ఉండి...తరవాతి కాలంలో జరిగిన పరిణామాల వలన, కొన్ని ప్రాంతాలు సపరేటు రాష్ట్రాలుగా ఏర్పడటంతో లేక కొన్ని ప్రాంతాలు కలవటం వలన, ప్రక్కగా ఉన్న రాజధానులుగా మారిపొయ్యాయి...ఇలాంటి దుర్గతి పట్టిన మహారాష్ట్రా, తమిళనాడు, వెస్టు బెంగాలు, కర్నాటకా, అస్సాము లాంటి 8 రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈ రాష్ట్రాలలో రాజధానులు మధ్యలో లేవు కదా అని అనటం, సరిగా చారిత్రకంగా ఆయా రాష్ట్రాల గురించి తెలియకపోవటమే... 


తమిళనాడు...ఇదివరలో మదరాసు రాష్ట్రంగా  పిలిచే పేద్ద ప్రదేశం. 
ఇప్పుడున్నదే కాకుండా, కోస్తా ఆంధ్రా, రాయలసీమా 
మరియూ దక్షిణ ఒరిస్సా ప్రాంతమైన బెరహంపూర్, రాయగడా లాంటి ప్రాంతాలతో ఉండేది... 
ఈ మొత్తం ప్రదేశాలకి చూసుకుంటే మద్రాసు నగరం సరిగ్గా మధ్యలోనే ఉన్నది.
తరవాత మదరాసుకి ఉత్తరాన ఉన్నది మొత్తం సపరేటు రాష్ట్రంగా విడిపోవటంతో
మద్రాస్ మిగిలిన రాష్ట్రానికి ఉత్తర అంచులో ఉన్న రాజధాని అయ్యింది.
రాష్ట్రంలో మధ్యలోనే ఉన్న మదరాసు 


మహారాష్ట్ర...ఇది తరవాత ఏర్పడిన రాష్ట్రం, 
మొదలులో బాంబే, ద. గుజరాతులతో కలిపి బాంబే రాష్ట్రంగా పిలిచే వారు... 
ఆ మొత్తం ప్రదేశానికి కూడా బాంబే మధ్యలోనే ఉన్నది.
 బాంబే రాష్ట్ర విభజనానంతరం... కొంత హైదరాబాదులో, 
మరికొంత సెంట్రల్ ప్రావిన్సులో
ఉండే భాగాలు కలిసి 
ముంబాయికి తూర్పున ఉన్న ప్రాంతం పెరిగిపోయింది.
బోంబే రాష్ట్రానికి బాంబేనే సెంటర్ పాయింటు 

హైదరాబాదు...ఇది కూడా ఉత్తర కర్నాటకా, తూర్పు మహారాష్ట్రా, 
ఇప్పుడున్న 10 జిల్లాలతో ఉండేది. 
ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హైదరాబాదు తూర్పుమధ్యలో ఉండినా... 
అందుబాటులోనే ఉండేది.
తరవాత,కన్నడ, మరాఠా ముక్కలు ఊడి...
తెలుగు ముక్క కలవటంతో పడమర ప్రక్కకి పోయింది.
అయితే, 
తిరిగి విభజన అవటంతో...రాజధాని మధ్యకొచ్చింది.
ఒకప్పటి హైదరాబాదూ ఇంతే...
.
 కలకత్తా: ఇప్పుడు వెస్టు బెంగాలు రాజధాని అయిన ఈ నగరం
 ఒకప్పుడు మహా బెంగాలు రాష్ట్రంగా ఉండేది ... 
దానిలో ఇప్పుడున్న బీహారు[ఝార్ఖండ్ కలిపి], ఉత్తర ఒరిస్సా, వెస్టుబెంగాలు,
 బంగ్లాదేశ్, అస్సాము[7 చిన్న రాష్ట్రాలతో కలిపి]ఉండేది...
 ఆ మొత్తం ప్రదేశాలకీ మధ్యలోనే ఉన్నది 
ఇప్పుడు కోల్కకతాగా పిలవబడుతున్న కలకత్తా. 
తరవాత బెంగాలు విభజనతో...
బీహారు, ఒరిస్సా, ఆస్సాము లాంటి రాష్ట్రాలు విడిపోవటం....
బంగ్లాదేశ్ విడి దేశంగా మారటం జరిగినాయి...
ఈ పరిణామాల వలన కలకత్తా  మూలగా ఉన్న రాజధాని అయ్యింది.
మహాబెంగాలుకు మధ్యలోనే ఉన్న కలకత్తా 

అలాగే, మైసూరు రాష్ట్రం ఉండేది. 
దాని చుట్టూ ఉన్న ప్రదేశాలకి 
బెంగళూరు కానీ మైసూరు కాని అందుబాటులో ఉండేవి... 
తరవాతి కాలంలో దానిలో హైదరాబాదు/బాంబే రాష్ట్రంలలో ఉన్న
 ఉత్తర కర్నాటకా కలియటంతో ఆ రాష్ట్ర రాజధాని మరీ క్రిందకి మారినట్టు అయ్యింది.
కేరళా కూడా రెండు రాజ్యాలుగా ఉండి, 
రెండు రాజధానులు ఉన్నాయి.
తరవాత రెండు కలిసి ఒకటై... క్రింది రాజధాని మిగిలింది.


ఇకపోతే,  ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్,  లాంటి 
11 రాష్ట్రాలలో రాజధాని మధ్యలోనే ఉన్నది. 
ఇందులో 9 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినవే...
అందువలన, రాజధాని మధ్యలోనే ఉండి తీరాలే కానీ 
ఏ కర్నూలులో ఉండి ఆంధ్రుల కన్నా తెలంగాణావారికీ, 
కర్నాటకా వారికీ అందుబాటులో ఉండకూడదు.... 
అలాగే,  మరో ప్రక్కన ఉండి 
ఇప్పటికే ఒరియా మరియూ చత్తిష్ ఘడ్ వారితో నిండిన విశాఖలో కూడా 
రాజధానిని పెట్టటం సమంజసం కాదు... 
అంతెందుకు, 
ఆంధ్రా రాజధానిగా ఒక మూలగా ఉన్న కర్నూలు అవటం వల్లనే...
దానిని కొత్తగా కలిసిన హైదరాబాదు రాష్ట్రంలోనికి మార్చారు ... 
ఎక్కువ మంది ప్రజల నుండీ ఎటువంటి వ్యతిరేకతా రాలేదు... 
దానికి జనామోదం కూడా లభించింది. 
కారణం 
కర్నూలు కన్నా హైదరాబాదు అందుబాటులో ఉండటమే.
అయితే,
రాష్ట్రాల కలయిక తరవాత కూడా కర్నులే ఉండి ఉంటే ఏ గొడవలు వచ్చేవి కావు.
లేదా... 
అప్పటి పోటిలో విజయవాడ రాజధాని అయి, మార్చకుండా ఉన్నా 
ఏ ఉద్యమాలు వచ్చేవి కావు.
దీనికి కారణం...
అప్పటి నాయకుల 
అసమర్ధ రాజకీయ నిర్ణయమే...

ఏది ఏమైనా
పైన ఉన్న కారణాల వల్లకానీ, 
మరే కారణాల వలనగానీ, 
రాజధానిని 
తప్పనిసరిగా 
ఓ ప్రక్కన  నిర్మించాలిసిన పరిస్థితి 
ఇప్పుడున్న
ఆంధ్రప్రదేశ్‌కు లేదు.

కాబట్టి,

రాజధానిని ఎక్కడ నిర్మిస్తే
అందరికీ అన్నివిధాలా అందుబాటులో ఉంటుందో 
చూసి మరీ నిర్మించటానికి
కావాలిసినంత 
స్వాతంత్రం ఉన్నది.

అనవసర లోకల్ సెంటిమెంటులకో 
బూజుపట్టిన ఒప్పందాలకో లొంగో
ప్రాంతీయ దురభిమానాలకి లోనయో
వెనకబడ్డారనే సాకుతోనో, 
[ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్ర నాయకులు ఇలానే అన్నారు]
మరల అసమర్ధ నిర్ణయాలు తీసుకోకుండా
మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని 
ఏ ఒక్క ప్రాంతానికో కట్టబెట్టకుండా,
రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే నిర్మించి;

మద్రాస్-హైదరాబాదులలో మోసపోయినట్లు 
మరోసారి మోసపోకుండా
రాజధాని ప్రాంతం మొత్తాన్ని 
13 జిల్లాల  ప్రజలందరికి "లోకల్ క్రింద"
హక్కు వచ్చేట్లుగా ఒక చట్టం చేస్తే
భవిష్యత్తులో మరో రాజధాని నిర్మించాలిసిన గతి పట్టదు.

 "స్వంతంగా నగరాలు నిర్మించుకోవటం తెలిసి
ఇప్పటికే 
మదరాసు-హైదరాబాదు లాంటి మహా నగరాల నిర్మాణంలో 
ప్రముఖ పాత్ర వహించిన సీమాంధ్రులకు 
కొత్త రాజధాని నిర్మాణం పెద్ద సమస్య కాబోదు".
ఈ విషయంలో అనవసర నాన్చుడు లేకుండా 
రాజధాని ఎక్కడో తేలిస్తే 
మిగిలినది సీమాంధ్ర ప్రజలే చూసుకుంటారు.

దీని గురించి
[లింకు నొక్కండి]  
అని ఈ బ్లాగులో 
ఒక సంవత్సరం క్రిందట
 సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు కాకముందే 
సూచించటం జరిగింది... 
దాని ప్రకారం అందరికీ అందుబాటుగా
రాజధానిని ప్రకాశం లేక కడప జిల్లాలలోని
  ప్రదేశాలలో పెడితే బాగుంటుందని వివరించటమే కాకుండా... 
ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యాలయాలని 
ఒకే చోట పెట్టకుండా 13 జిల్లాలలో పెడితే 
అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని 
వివరించటం జరిగింది.



భారతదేశంలోని 28 రాష్ట్రాలలోరాజధానుల పారిస్థితి

[ఆంధ్రప్రదేశ్ కాకుండా]

11 రాష్ట్రాలలో రాజధానులు మధ్యలోనే ఉన్నవి.  ఇందులో కొత్తవి 9


ఉత్తర ప్రదేశ్ 
బీహార్ 
ఝార్ఖండ్ 
మధ్యప్రదేశ్
ఛత్తీస్ ఘర్ 
గుజరాత్ 
గోవా 
తెలంగాణా 
సిక్కిం 
నాగాలాండ్ 
మణిపూర్ 



ఎడారి/కొండలు/అడవులు వలన 8 రాష్ట్రాలలో రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నా...

జనసమర్ధం గల ప్రాంతాలకి దగ్గరలోనే ఉన్నాయి. .కొత్తవి 6


రాజస్థాన్ 
హిమాచల్ ప్రదేశ్ 
ఉత్తరాఖండ్
ఒరిస్సా
అరుణాచల్ ప్రదేశ్ 
మేఘాలయ 
మిజోరాం 
త్రిపుర 


మంచు/కొండలు మరియు ఆక్రమణ వలన 1[3]  రాష్ట్రాల రాజధానులు ఓ ప్రక్కగా ఉన్నాయి.



జమ్మూ అండ్ కాశ్మీర్ 
అరుణాచల్ ప్రదేశ్ [1]
పంజాబ్ [1]


విభజన వలన 8 రాష్ట్రాల రాజధానులు ప్రక్కకి ఉన్నాయి. 



అస్సాం 
హర్యానా 
పంజాబ్ 
మహారాష్ట్ర 
వెస్ట్ బెంగాల్ 
తమిళనాడు 
కేరళ 
కర్నాటక 



లింకులు నొక్కండి:
@@@@@@@@@@@@@@@@@@

  కర్టేసి:ఇందులోని మేపులన్ని గూగుల్ లోనివే...




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి