LOCAL WEATHER

21, మార్చి 2021, ఆదివారం

కీర్తి కాంక్షా ఉన్మాదం... సొమ్ము ప్రజలది....సోకు నాయకులది..


దేశంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే... రాజకీయ నాయకులకి డబ్బు పిచ్చతోబాటూ కీర్తి కాంక్ష పిచ్చి బాగా ఎక్కినట్లు కనపడుతోంది...ఇది డబ్బు పిచ్చకన్నా ముదిరి... ప్రజలకి పరిమినెంటుగా పనికొచ్చే వాటి కన్నా తమకి పేరొచ్చే పనులకే ప్రాధ్యాన్యతని ఇస్తున్నారా నాయకులు...దీని వల్లనే ఇంత పెద్ద ప్రజాసామ్య దేశమైన భారత దేశ ప్రజలకీ రావాలిసినంత మంచి పేరు రావటం లేదు...


ఇది ఇప్పుడంటే ఇప్పుడే పట్టిన పిచ్చి కాదు...ఒకప్పుడు... కృష్ణా బ్యారేజీ గేట్లు ఎత్తి నీరు వదలాలంటే లేదా ఏ సాగారో, శ్రీశైలం గేట్లు అవసరార్ధం ఎత్తాలంటే... దానికి సంబంధించిన ఇంజనీరు...పనివాళ్ళు వచ్చి ఆ పని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని పొయ్యేవారు...."అదొక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఓ విధిలా" నిర్వర్తించే వారు....అలా చాలా కాలం సాగింది... తరవాత కాలంలో కీర్తి పిచ్చ పట్టిన నాయకులు వచ్చిన తరవాత... ఓ కాలువ లాకులు ఎత్తటానికి కూడా ముఖ్యమంత్రి లెవెల్లో వచ్చి.... కొబ్బరికాయలు కొట్టి పూలు జల్లి...కార్యకర్తలచే నానా హడావిడి చేయించి... అక్కడికేదో "ఆ నీళ్ళు తమ వల్లనే వస్తున్నాయన్నట్లు" గొప్పగా ఫొటోలకి ఫోజులు ఇచ్చి.... తమ డబ్బా మీడియాలో ప్రచారం చేయించటం మొదలెట్టారు... 


ఇది ఎంత ముదిరింది అంటే.. నాయకులకి తీరిక లేకపోతే...లాకులేత్తే కార్యక్రమాన్నే వాయిదా వేసేంతగా... ఈ పిచ్చ వల్లనే ఒకానొకనాడు... సకాలంలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తకపోవటం వలన కర్నూలు ముణిగింది...


సరే, ఓ పట్టణం ముణిగితే పోయ్యేదేమున్నది అనే పార్టీ ఉన్మాదులున్నారు... అయితే, అక్కడితో ఆగటం లేదు... ఈ రోజున ప్రజల డబ్బుతో రకరకాలైన పధకాలు పెట్టి... వాటికి తమ పేరు లేక తమ వారి పేరు పెట్టుకోటం కోసం పోటీలు పడుతున్నారు.... డబ్బు ప్రజలది...పధకాల పేర్లు నాయకుల-సంబంధీకులవి... ఏ గొప్ప నాయకుడు అనుకున్న వాడైనా "ప్రజల పేరుతో పధకాలు పెట్టారా"...?? పెట్టరు. డబ్బు జనాలది... సోకు నాయకులది... దానికోసం కొట్టుకునే చెంచాలైన పార్టీ కార్యకర్తలది...ఇక శంకుస్థాపన రాళ్ళ మీద ఇది వరకు ఓ నాయకుడి పేరుతొ సరిపెట్టే వారు... మిగిలినవి ఆ ప్రాజెక్టు చేసిన కంపెనీ వివరాలు ఉండేవి... ఇప్పుడు పనికిమాలిన కార్యకర్తల పేర్లతో సహా అన్నీ ఉంటున్నాయేగానీ...కట్టిన వారి పేరుండటం లేదు...!!!


ఇలా ఒకటేమిటి...రాజకీయ నాయకులు లేకపోతే ప్రజలే లేరన్న అహంకారానికి ఎదిగి పొయ్యారు.... నిజానికి ప్రజాసామ్యంలో ప్రజలకి ఇవ్వాలిసినంత గౌరవం ఇస్తున్నారా.... "తాము... తమ తల్లిదండ్రలు లాంటి వాళ్ళు లేకపోతే ప్రజలు అడుక్కు తినాలి" అనే విధంగా ప్రజల మనస్సుల్ని నాశనం చేశారు...చేస్తున్నారు...నిజానికి ప్రజల డబ్బు లేకపోతే రాజకీయ నాయకులకి గానీ అధికారులకి గానీ హంగూ ఆర్భాటం ఎక్కడి నుండి వస్తాయి...? అడుకున్నేది ప్రజల దగ్గర నుండి.... అదిలించేది ప్రజలని....త్యాగాలన్నీ ప్రజలే చెయ్యాలి... నాయకులు-అధికారులు  మాత్రం AC కార్లు, AC ఆఫీసులు వదిలి రారు...


పోనీ నిజంగా ప్రజల మీద ప్రేమున్నదా అంటే..ప్రభుత్వాలు ఎంత సంకుచితంగా తయ్యారైనాయంటే... సంవత్సరానికి గరిష్టంగా 12 గ్యాస్ సిలిండర్లు ఓ కుటుంబం వాడితే, వాటికి అయిదారు వేలు సబ్సిడీ ఇవ్వాలంటే, ఏదో దేశానికి నష్టం వచ్చేస్తున్నట్లు మాట్లాడేస్తున్నారు... నిజానికి ఒక్కో కుటుంబం మీద సంవత్సరానికి కొన్ని వేల నుండి లక్షలు రుపాయలు పన్నులు ద్వారా వసూలు చేస్తున్నారు.... తాము ప్రజల నుండి కొట్టేసిన వేల-లక్షల పన్నుల నుండి కొంత సబ్సిడీ ఇవ్వాలంటే "పెట్టుబడే పెట్టని ప్రభుత్వాలకి నష్టం వస్తుందిష"...... ఇలా ఉంటాయి నిజమైన పెజా సేవలు....వీటిని సమర్ధించే పనికిమాలిన మేధావులు... డబ్బు ఎక్కడి నుండి వస్తోంది...ఎవరికీ ఖర్చు పెడుతున్నారో  తెలిసి కూడా గొప్పగా మొఖాలు పెట్టి "ఇది పధ్ధతి కాదు" అని అనేస్తారు... వేలకి వేలు లక్షలు పెన్షన్లు పొందుతూ...   


ఈ పరిస్థితికి ఓ పార్టీని... ఓ నాయకుడిని అనవలసిన పని లేదు... అందరిదీ ఒకటే దారి...వాళ్ళు లేకపోతే దేశం-రాష్ట్రాలు నాశనం అయిపోతాయి అన్నంతగా ప్రజలని మోసం చేస్తున్నారు...పోనీ ఆయా పనులకి కష్ట పడిన వారి పేర్లు పెడుతున్నారా అంటే అదీ లేదు....దీనికి ఒకటి రెండు ఉదాహరణలు సాగర్ డ్యాం కోసం నానా కష్టాలు పడిన ఓ జమిందారు పేరు ఎవరికీ తెలియదు గానీ...[SRI Raja Vasireddy Ramagopala Krishna Maheswara Prasad, popularly known as late Muktyala Raja, was instrumental in the construction of the Nagarjuna Sagar Dam through active political lobbying and the donation of one hundred million British pounds and fifty-five thousand acres of land. It was the tallest masonry dam in the world at that time, built entirely with local know-how under the engineering leadership of  SRI Kanuri Lakshmana Rao.(KL RAO)] ...దానికి శంకుస్థాపన మాత్రమే చేసిన నాయకుడు మాత్రం అందరికి తెలిసి పొయ్యాడు....

లింక్: https://en.wikipedia.org/wiki/Nagarjuna_Sagar_Dam


అలాగే అనేక నగరాలలో రోడ్లు వెడల్పు చేసి తిట్లు తినేది కమీషనర్లు.... పేర్లు మాత్రం MGMలు, JNలు... ఇంకా లోకల్ గా ఆ రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు అడ్డు పడే నాయకుడి తాలూకు పేర్లు.... ఇలాంటిదే, విజయవాడలో కష్టపడి వెడల్పు చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు పెట్టకుండా... ఓ దానికి నెహ్రు పేరు.... మరో దానికి GS రాజు పేరు పెట్టారు... వాళ్ళకి ఈ రోడ్డుకు సంబంధమే లేదు....అయితే, విజయవాడ ఓ విధంగా పని చేసిన కమిషనర్ల ఋణం తిర్చుకుం కుంటో౦ది...ఇక్కడ అనేక పేటల పేర్లు రాజకీయ నాయకులవి కాకుండా కమిషనర్ల పేర్లతో ఉన్నాయి....[అజిత్‌సింగ్ నగర్, రాజివ్ నగర్, వించి పేట, బకింహం గవర్నర్ పేట లాంటివి...]


సరే....ఇదో కీర్తి కాంక్ష ఉన్మాదం... మరి ఈ పిచ్చ వదలాలంటే ఒకటే మార్గం... నాయకులకి పేర్లు ఉండటం వల్లనే కదా ఈ గోల...అందుకని: 


1] ఎలక్షన్లో గెలవంగానే వారి పేర్లని తీసేసి... వారు గెలిచిన నియోజక వర్గం పేరుతోనే పిలవాలి....ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ MLA లేక గుంటూరు MP అనే పేర్లతో మాత్రమే వ్యవహరించాలి...


2] మంత్రుల్ని వారి శాఖ పేరుతొ మాత్రమే పిలవాలి....ఉదాహరణకి రైల్వే మంత్రి, ఆర్ధిక మంత్రి...


3] ముఖ్యమంత్రుల్ని-ప్రధాన మంత్రుల్ని వారి సంఖ్య బట్టి పిలవాలి...ఉదాహరణకి దేశం స్వాతం స్వాతంత్రం వచ్చాక ఎన్నోవ ప్రధాన మంత్రి....ప్రధాన మంత్రి 4,5,6....అలాగే, రాష్ట్రం పుట్టాక ఎన్నోవ ముఖ్య మంత్రి.... ముఖ్యమంత్రి 1,2,3...


4] శంకుస్థాపనలు-ప్రారంభోత్సవాలు పూర్తిగా నిషేధించాలి....ఆయా రాళ్ళ మీద ప్రాజెక్టు వివరాలు... అంటే: ఎప్పుడు మొదలెట్టారు...ఎప్పుడు ప్రజా  వినియోగానికి వచ్చింది... ఖర్చు ఎంత అయ్యింది...దానిని కట్టిన/బాధ్యత వహించాలిసిన కంపెనీ పూర్తి వివరాలు మాత్రమే ఉండాలి....


5] అసలైన పిచ్చి ప్రచారం టివిల వలన కాబట్టి, ఆగష్టు 15, జనవరి 26కి తప్ప మరెప్పుడు రాజకీయ నాయకులెవ్వరు టివీలలో కనపడ కూడదు...[బహుశా వార్తా చానళ్ళు మొత్తం మూత బడే అవకాశం ఉన్నది...] 


6] జిల్లాల పేర్ల లాంటివి అక్కడ ఉన్న నదులు కొండలు ప్రాంతాల పేర్లతోనే వ్యవహరించాలి....


7] పధకాల పేర్లు...ఆయా పధకం ఉద్దేశ్యం తెలిసే పేరే పెట్టాలి...


8] రాజకీయ నాయకుడి పేరుతొ వచ్చే పేర్లు వాడ కూడదు....[ఉదాహరణకి మెక్ డొవేల్స్ గ్లాసులు...చార్మినార్ పెన్నులు లాగా...]


9] ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు పెట్టకూడదు...


ఇవన్నీ జరిగేనా.. అని అనుకోవద్దు... ఇలా చేసే ప్రజాసామ్యం మీద ప్రజల మీద గౌరవం ఉన్న నిజమైన నాయకుడు వస్తే ఇదేమంత కష్టమయిన పని కాదు... అదే జరిగిన నాడు...తమ కీర్తి కోసం దేశ ప్రజలకి చెడ్డ పేరు తెచ్చే నాయకుల నుండి రక్షించబడి... రాజకీయ పోల్యుషన్ పొయి అనేకం దీనితో సంబంధం ఉన్న రుగ్మతలు కూడా పోయి...రాజకీయ నాయకుల కీర్తి కాంక్ష ఉన్మాద రహిత భారత ప్రజాసామ్య దేశంగా...."స్వచ్చ ప్రజాసామ్య  భారతదేశంగా" భారత దేశ ప్రజలు ప్రపంచంలో గౌరవ మన్ననల్ని పొందుతారు....


__________________________

జై   హింద్ 

__________________________


దీనికి ముందు పోష్టులు....
ఈ క్రింది లింక్ నొక్కండి

"అబ్బో మన దేశంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు"...

విషయం: టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన  ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...???



ఈ క్రింది లింక్ నొక్కండి

 TV 9 రజని గారు అడగని ప్రశ్నలు...

విషయం: విశాఖా స్టీల్ ప్లాంట్ 






6 కామెంట్‌లు:

  1. అద్భుతంగా ఉన్నది వ్యాసం. ముఖ్యంగా 9 సూచనలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. మరొక సూచన:

    ఎవరిదైనా సరే విగ్రహం పెట్టాలి అంటే, ఆ మనిషి మరణించి కనీసం పది సంవత్సరాలు అయ్యి ఉండాలి. పది సంవత్సరాలు తరువాత కూడా ప్రజలు గుర్తుంచుకునేంత మంచి చేసిన వాళ్ళకే విగ్రహన్ని పెట్టబడే అర్హత. ఇదే విధానాన్ని ఒక మనిషి పేరు వీధి, పేట లేదా జిల్లాకు పెట్టేప్పుడు కూడా పాటించాలి.

    రిప్లయితొలగించండి
  3. వ్యాసం చాలా బాగా వ్రాశారు.
    ఏమిటీ, శిలాఫలకాల మీద పార్టీ కార్యకర్తల పేర్లు కూడా వ్రాస్తున్నారా? పతనంలో మరొక మెట్టు అన్నమాట. ఇదొక దారి తప్పిన దేశం.

    పైన మీరు చెప్పిన తొమ్మిది పాయింట్లకు మరొకటి కలపాలండి. అదేమిటంటే - ఏ భవనాలకు, కాలనీలకు, ఎయిర్-పోర్ట్ లకు, బస్టాండ్లకు ఏ వ్యక్తి పేరూ పెట్టకూడదు.

    రిప్లయితొలగించండి