LOCAL WEATHER

23, మే 2021, ఆదివారం

ఆధునీకతా ఏంది నీ కత...

ఏమిటి వేడి చేసే తినాలా 

హాయిగా పచ్చివి తింటే పోలా...

ఏమిటి ఇలా రుద్ధంగానే వెలుగుతోంది...

హాయిగా రెండు రాళ్ళు కొడితే మంట వస్తుంటే....

ఏమిటి ఇళ్ళు కూడా కట్టుకోవాలా...

హాయిగా గుహల్లో ఉండచ్చును కదా....

ఇలానే మనం అనాగరికులు అని అనుకునే వారు ఆలోచించి ఉంటే

ఇప్పటి ఆధునీకత వచ్చేదా....

"ఏదైనా మనకు తెలిస్తేనే శాస్త్రం.... అర్ధం అయితేనే సైన్సు" 

అని అప్పటి వారు అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదా....

ఏదైనా కొత్తది వచ్చినప్పుడు ఎక్కువ మంది 

అయిష్టంగా అయినా ఆమోదించారేగానీ నిర్మొహమాటంగా తిరస్కరించలేదు....

అలా చెయ్యలేదు కాబట్టే 

"సైన్సు అనబడే మానవ జీవితం" ఆధునీకత సంతరించుకుంటూ వచ్చింది....


అంతా బానే ఉన్నది అని అనిపిస్తోంది కదా..... 

కానీ లేదు....

కర్టేసి ఫేస్ బుక్ 

వస్తువుల్లో ఆధునికత పెరిగిన కొద్ది మనిషి బుద్ధిలో మాత్రం... ఆనాటి అనాగరీకుడికి లేని నికృష్టపు ఆలోచనలు పెరిగినాయి...ఈ ఆధునికత పెరగక ముందు.... ఎవరైనా ఏది అయినా కొత్తది కనిపెడితే... దానిని అందరితో పంచుకునే వారు... అందుకనే ఆనాడు ఆర్కిమిడిస్ కొత్త సిద్దాంతం తోచగానే.... వంటి మీద బట్టలు ఉన్నాయో లేవో చూసుకోకుండానే "యురేకా" అంటూ జనాల మధ్యకి పరిగెత్తుకుని వచ్చాడు....

కానీ, ఇప్పుడు... ఈ కంప్యుటర్ యుగం అనబడే దానిలో ...అదే తెలివైన మానవడు ఏదైనా కనిపెట్టగానే [మూడు దశాబ్దాలుగా కనిపెట్టింది కూడా ఏది లేదు...ఉన్నదాన్ని అప్ డేట్ చెయ్యటం తప్ప]....కార్పోరేట్ కాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నాడు...పేటెంటు...స్వంతం అనుకుంటూ సాటి మానవ సమాజానికి పనికి రాకుండా డబ్బే పరమావధిగా బ్రతుకుతున్నారు.... కేవలం డబ్బే కాదు...అధికారం....పార్టీల ఉన్మాదంతో సమాజ హితానికి దూరంగా పోతున్నారు....విచిత్రం ఏమంటే.... ఇలా మారిన మనిషికి సపోర్టుగా  మేధావులనబడే రాజకీయ పార్టీ బానిసలు వంతపాడటం... 

అది కాదని ఎవరైనా జనం దగ్గరకు వెళ్ళాడో అతని పని అయిపోయినట్లే... అతనిని మానసికంగా హింసించి... నీకు ఆ పరిజ్ఞానానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నదా...చదువుకోకుండా[?] ఎలా చేశావు... ఇది శాస్త్రీయం కాదు అంటూ అతనికి... ఎందుకు కనిపెట్టానురా దేవుడా అని అనిపిచేట్లు చేస్తున్నారు.... పోనీ ఈ అడిగే వారు టివీలలో చర్చలు చేసే మేధావులకి ఏమన్నా ఆ డిగ్రి సర్టిఫికెట్లు ఉన్నాయా అంటే... 90 శాతం మందికి  కనీస జ్ఞానం కూడా ఉండదు... 


నిజానికి సర్టిఫికెట్ల గురించే అడిగేట్లుంటే... ఈ రోజున మనవాళ్ళు  "ఎగిరిపడే ఆధునీకతకి పునాది.... కరెంటు....వెలుగు.....కమ్యునికేషన్ లాంటివి కనిపెట్టిన ధామస్ ఎడిసన్ కి  గ్రాహం బెల్ కి  ఇప్పుడున్నా ఏ దరిద్రపు ఇంజనీరింగ్ కాలేజీ సర్టిఫికెట్లు లేవు"... ఆయనెవరో చెప్పినట్లు, పోతన గారు తెలుగు BA చదవలేదు... BA చదవాలిసిన వారే ఆయన వ్రాసినవి చదువుతున్నారు.....


అలాగే, బిల్దింగ్ ప్లాన్ వేసే పేద్ద ఇంజనీరు కాగితం మీద గీతలలో మాత్రమే బిల్దింగ్ చూపించగలడు...బయట నాలుగు ఇటికలు కూడా సమానంగా కట్టలేడు... ఆ కట్టే వారికి ఈ చదువు అనబడే చదువుండదు...కానీ వారు అన్ని కోణాలు సమంగా కట్టుకొని వస్తారు...ఇలా ఒకటేమిటి... స్కూటర్ మెకానిక్కు దగ్గర నుండి బుల్డోజర్ మెకానిక్కుల దాకా ఎవరికీ సర్టిఫికెట్లు ఉండవు... 
.వీరి ఉద్దేశ్యంలో వారికి చదువు లేదని...సర్టిఫికేట్ లేదని.....విజ్ఞానానికి సర్టిఫికెట్లకి ఏ మాత్రం సంబంధం లేదన్న కనీస  జ్ఞానం ఇప్పటి కంప్యూర్ యుగపు మేధావులకి ఎందుకు లేదో తెలియటం లేదు... 

ఇంతకీ వీళ్ళ ఇంటెన్షన్ ప్రజల బాగు కోరా.... 

కాదని మొహమాటం లేకుండా చెప్పోచ్చును... 

ఎంతో దుర్మార్గంగా దోచుకునే వారిని 

వీరు అసలు ప్రశ్నించరు....హింసించరు.  

ఇలాంటి వారిని అనాగారికులతో పోల్చటానికి లేదు.....

వారికున్న అభ్యుదయ భావాలు...

సమాజాన్ని రక్షించుకుందాం అనే పట్టుదల 

ఇవేమీ లేని వీరిని 

"నీతిలేని మానవులు" 

అనే చిన్న మాట మాత్రమే వాడవలసి రావటం విచారకరం...


మనిషికి సౌకర్యాలు పెరిగిన కొద్ది మంచిగా పనిచెయ్యాలి...

మంచిగా ఆలోచించాలి....కానీ, 

దానికి విరుద్ధంగా ఏదో చేద్దాం అనే తపనలో 

కొత్త కొత్త సౌకర్యాలని కనిపెట్టే బదులు 

రోగాలని కనిపెడుతూ వాటి నుండి ఎలా బయటపడాలో తెలిసి కూడా 

బయట పడలేక  చస్తూ  నీచంగా బ్రతుకుతూ.... 

ఇదే ఆధునీకత  అని మభ్యపెట్టుకుంటూ 

జీవనం గడిపేస్తున్నారు...

ఏ చేద్దాం.... చేసేదేమీ లేదు....

తెలియని వారికి చెప్పొచ్చుగానీ... తెలిసి చేసే వారికి చెప్పేదేమున్నదండి.....


@@@@@@@@@@@@@@

జై   హింద్ 

@@@@@@@@@@@@@@

ఇందులోని బొమ్మల కర్టేసి గూగుల్ 

ఇంతకు ముందు వేసినది...

క్రింది లింకు నొక్కండి 

హైదరాబాదు చిన్న చేప మందా..?? కార్పోరేట్ పెద్ద చేప మందా......???


దీనికి ముందు పోష్టులు....

ఈ క్రింది లింక్ నొక్కండి

"అబ్బో మన దేశంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు"...

విషయం: టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన  ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...???

ఈ క్రింది లింక్ నొక్కండి

విషయం: తమ పేరుకోసం ప్రజలని అవమానిస్తున్న నాయకులు...








2 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నది వ్యాసం.

    చదువు అంటే అక్షరాస్యత మాత్రమే అనుకోవటం ఆధునిక మానవుడు చేస్తున్న అతి పెద్ద పొరబాటు

    రిప్లయితొలగించండి
  2. Saahitya Abhimaani స్పందిచినందుకు ధన్యవాదాలు...
    అవును... మనిషి విజ్ఞానానికి చదువుకి సబంధం లేదు... కేవలం అతని విజ్ఞాన్ని వ్యక్తపరచటానికి...మెరుగు చెయ్యటానికే చదువనబడేడి...

    రిప్లయితొలగించండి