LOCAL WEATHER

25, నవంబర్ 2012, ఆదివారం

రైళ్ళూ ప్రయాణాలూ బస్సులూ---వరంగల్...ఉత్తర తెలంగాణా

రాష్ట్రంలో ఎటు నుండి ఎటైనా తిరగాలంటే ప్రయాణ సౌకర్యాలున్న ముఖ్యంగా మూడు సెంటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చును.  అవి,  విజయవాడ,  హైదరాబాదు,  తిరుపతి.  ఇవి కాకుండా,  జిల్లాలని దాటి కొంత పరిధి వరకూ తిరిగే ప్రయాణ సౌకర్యాలున్న సెంటర్లు షుమారుగా 6 ఉన్నాయి. అవి.... విశాఖపట్టణం, రాజమండ్రి, గుంటూరు, నెల్లురు, కర్నూలు, వరంగల్లు[హనుమకొండ].  

ముందుగా విజయవాడని తీసుకోవచ్చును.....ఎందుకంటే రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, రాయలసీమ, తూర్పు ఆంధ్రా మరియూ కోస్తా ఆంద్రాలోని అన్ని జిల్లలలోని ప్రధాన నగరాల నుండే కాకుండా, అనేక పట్టణాలకి కూడా  డైరెక్టు బస్సులు ఉన్నాయి......అలాగే విజయవాడ దగ్గర 5  వైపులా కలిసే  రైల్వే  లైన్ల ద్వారా రాష్ట్రమే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకీ డైరెక్టు రైళ్ళ సౌకర్యం కూడా ఉన్నది....అయితే అందరికీ కావలిస్నప్పుడు దొరికేనన్ని సర్వీసులు  అందుబాటులో లేవు....అసలు ఇలాంటి అవకాశాలున్న ఈ ఊరుని ట్రాన్స్‌పొర్ట్ హబ్‌గా చేసినట్లైతే అందరికీ అన్ని విధాలుగా బావుంటుంది.....  సరే, ఈ ఆలోచన ఇంకో 100 ఏళ్ళకి మన నాయకులకి వస్తుందన్నా ఆశతో అసలు విషయంలోనికి వెళదాము. విజయవాడ నుండీ విశాఖ... తూర్పు ఆంధ్రా వైపుకి ఎలా వెళితే బాగుంటుందో నాకు తెలిసినంతవరకూ ఇంతకు ముందు వివరించాను....ఈ సారి ఉత్తర తెలంగాణా వైపుకి ఎలా వెళితే బాగుంటుందో తెలియ చెయ్యటానికీ ప్రయత్నిస్తాను.

విజయవాడ నుండీ వరంగల్లు...కరీంనగర్....

 

విజయవాడ నుండీ హైదరాబాదుకి తప్ప మిగిలిన తెలంగాణా జిల్లాల వైపునకి సరైన రోడ్డు మార్గాలు ఎందుకనో అభివృద్ధి చెందలేదు....విజయవాడ నుండీ ఖమ్మం, ఓరుగల్లులకు   బస్సులో వెళ్ళాలంటే నరకమే కనిపిస్తుంది....ఇక కరీంనగర్ లాంటి ప్రదేశాలకి చెప్పనే అఖర్లేదు. విజయవాడ నుండీ ఉండటానికి డైరెక్టు బస్సులు ఉన్నాయి కానీ, వాటిని వాడకపోవటమే మంచిది...రైలులో ఖమ్మంకి కేవలం రెండుగంటల లోపలే చేరుకోవచ్చును. వరంగల్‌కి నాలుగు గంటలలోపల చేరుకోవచ్చును. బస్సులోనే వెళ్ళాలంటే విజయవాడనుండీ హైదరాబాదు మార్గంలో 3 గంటలు ప్రయాణం చేసి కోదాడకు వెళ్ళి, అక్కడి నుండీ బస్సులొ గంట ప్రయాణం చెసి ఖమ్మం చేరుకొవటం తేలిక.  

 విజయవాడ-వరంగల్  రైళ్ళ  వివరాలు  క్రింది లింకులు నొక్కండి 

భద్రాచలానికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉన్నది.....అక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుండీ కావాలిసినన్ని బస్సులు ఉన్నాయి...వాటిలో కేవలం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి షుమారు 4 గంటలలో భద్రాచలం వెళ్ళ వచ్చును. చార్జి ఎక్కువైనా ఇదే మంచి ప్రయాణం....ఇదే కనుక రైలులో వెళ్ళాలంటే ఉదయానే 8:00 గంటలకి భద్రాచలం[కొత్తగూడెం]పాసెంజెరు ఉన్నది. దీనిలో  ఆరు గంటల పాటూ ప్రయాణం చేసి, కొత్తగూడెం చెరుకొంటాము. మళ్ళీ అక్కడ [స్టేషను ఎదురుగానే బస్సులు వస్తాయి] బస్సు ఎక్కి గంటన్నర పాటూ ప్రయాణం చేసి భద్రాచలం మధ్యాన్నం 4:00 గంటలకి చెరుకొంటాము...... ఇదే ప్రయాణం ఉదయం 8:00 గంటలకి  విజయవాడ నుండీ బస్సులో బయలు దేరితే 12:00 గంటలకల్లా చేరుకొంటాము.  విజయవాడ నుండి అరగంటకొక బస్సు భద్రాచలానికి ఉన్నది. మొదటి బస్సు తెల్లవారు ఝామున  3:30కి.
 
యదగిరిగుట్టకి విజయవాడ నుండి వెళ్ళాలంటే రైలులో షుమారు 6 గంటలు ప్రయాణం చేసి బొన్‌గిర్[భువనగిరి]దిగితె, అక్కడి నుండీ బస్సులో అరగంట లోపల యాదగిరిగుట్ట    చేరుకోవచ్చును...హైదరాబాదు నుండీ యాదగిరిగుట్ట వెళ్ళే బస్సులు చాలా వరకూ భువనగిరి మిదుగానే వెళతాయి. కాని భువనగిరిలో ఆగే రైళ్ళు చాలా తక్కువ....సూపర్ ఫాస్ట్ రైళ్ళు అసలు ఆగవు. ఇదే విధంగా ఉన్న అన్నవరం రైల్వే స్టేషనులో అన్ని రైళ్ళు ఆగుతాయి.   బాధాకరమైన విషయం ఏమంటే ఎన్నో ఉద్యమాలు చేసే వారికి,  ఇలాంటి ప్రజలకి పనికొచ్చే  విషయాల  పట్ల శ్రద్ద లేదు..

కరీంనగర్: ఇక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుండి రైలులో 4 గంటలు ప్రయాణం చేసి వరంగల్ దిగితే ఎదురుగా బస్‌స్టాండు....అక్కడ లేకపోతే,   సిటీ బస్సులో  హనుమకొండ     బస్టాండుకు చేరితే.....కేవలం  కరీంనగరే కాదు, ఉత్తర తెలంగాణాలోని అన్ని ఊళ్ళకీ బస్సులుంటాయి....పుణ్య క్షేత్రాలైన వేములవాడ...కాళేశ్వరాలకి కావాలిసినన్ని బస్సులుంటాయి. వరంగల్ నుండి సిద్దిపేట గంటన్నరలో చేరుకోవచ్చును. వరంగల్‌లో బస్సెక్కితే కేవలం గంటన్నర ప్రయాణం చేసి కరీంనగర్ చేరుకోవచ్చును. కరీంనగర్ నుండీ 45 నిమిషాలు ప్రయాణం చేసి ప్రముఖ పుణ్య క్షేత్రం వేములవాడ చేరుకోవచ్చును. 
 
కాళేశ్వర పుణ్య క్షేత్రనికి చేరుకోవాలంటే; వరంగల్ హనుమకొండ  బస్‌స్టాండు నుండీ 2:30 గంటల
ప్రయాణం.  విచిత్రమేమంటే జిల్లా కేంద్రమైన కరింనగర్ కంటే హనుమకొండ నుండే ఎక్కువ బస్సులుంటాయి.... విజయవాడ నుండీ కాళేశ్వరం వెళ్ళాలంటే ఉదయానే 6:00 గంటలకి శాతవాహనా ఎక్స్‌ప్రెస్స్ ఎక్కి ఉదయం 10:00కి వరంగల్ దిగి అక్కడ నుండీ బస్సు ఎక్కి మద్యహ్నం షుమారు  12:30 గంటలకల్లా కాళేశ్వరం చేరుకొని, దర్శనం చేసుకొని తిరిగి వెనుకకి వరంగల్ రావటం మంచిది....ఎందుకంటే కాళేశ్వరం సమస్యాత్మక గ్రామం, అక్కడ రాత్రి బస చెయ్యటానికి సౌకర్యాలు ఉండవు. కాళేశ్వరం వద్ద రెండు నదులు....గోదావరి, ప్రాణహిత... కలుస్తాయి.  దీనికి దగ్గరలోనే ఏపీ, మహారాష్ట్రా, చత్తిస్‌ఘర్ రాష్ట్రాల సరిహద్దులు కలుస్తాయి.            

నిజామాబాదు వెళ్ళాలంటే విజయవాడ నుండి హైదరాబాదు మీదగా వెళ్ళచ్చును.....కానీ దానికంటే ముందరగా వెళ్ళాలంటే రైలులో వరంగల్ వద్ద దిగి నిజమాబాదు బస్సు పట్టుకొంటే షుమారు 3:30 గంటలలో వెళ్ళ వచ్చును. అంటే రైలులో వరంగల్లు నుండీ హైదరాబాదు వెళ్ళే లోపల, అదే ప్రయాణ సమయానికి నిజామాబాదు చేరుకోవచ్చును.  నిజామాబాదు నుండి ప్రముఖ పుణ్య క్షేత్రం  బాసర  కేవలం 40 కిలొ మీటర్ల దూరంలో ఉన్నది. దీనికి బస్సులో  గంట ప్రయాణం చేసి చెరుకోవచ్చును. బాసర వెళ్ళాలంటే బస్సులో వెళ్ళటమే మంచిది....ఎందుకంటే రైల్వే స్టేషను ఆలయానికి దూరంలో ఉన్నది. నిజమబాదు నుండి బస్సులో 2:30 గంటలలో ఆదిలాబాదు చేరుకోవచ్చును. రైళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి. కాని ప్రయాణ కాలం ఎక్కువ...విజయవాడ నుండి ఒకటి రెండు రైళ్ళు తప్ప ఎక్కువ లేవు.

నిర్మల్ చిత్రం   

అదిలాబాదుకి డైరెక్టు రైలులో వెళ్ళటానికి షుమారు 17 గంటల సమయం పడుతుంది.....అదే కనుక రైలులో వరంగల్ దిగి బస్సులో కరీంనగర్, జగిత్యాల మీదుగా వెళితే కేవలం 9 నుండి 10 గంటలలో విజయవాడ నుండి అదిలాబాదు చేరుకోవచ్చును. అలాగే, నిజామాబాదుకి ఉన్న ఒకటీ రెండూ రైళ్ళలోవెళ్ళాలంటే కనీసం 11 గంటల సమయం పడుతుంది.....అదే, వరంగల్ వరకూ రైలులో వెళ్ళి, అక్కడ బస్సు ఎక్కితే, విజయవాడ నుండీ కేవలం 7 గంటలలో కరీంనగర్ మీదుగా నిజమాబాదు చేరుకోవచ్చును.  రంగురంగుల చిత్రాలకి పెరేన్నికగన్న నిర్మల్ ప్రాంతం, నిజామాబాదుకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉన్నది.   ఆదిలాబాద్, నిజామాబాద్లకి  వరంగల్.  కరీంనగర్, జగిత్యాల నుండి బస్సులు మారి వెళితే తొందరగా వెళతాము.

రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్లకి విజయవాడ నుండీ  వెళ్ళాలంటే నార్త్ ఇండియా వెళ్ళే 25 రైళ్ళూ వెళతాయి.........6:00 గంటలు ప్రయాణం చేసి రామగుండానికి, మరో గంట ప్రయాణం చేసి సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకోవచ్చును. విజయవాడ నుండి పెద్దపల్లికి డైరెక్టుగా  రైలులో వెళ్ళాలంటే ఉదయాన్నే 10:00 గంటలకి మెహబూబాబాద్ పాసెంజెరు ఉంటుంది, ఇది  మహబూబాబాదు మద్యహ్నం 2:00 చెరుకోగానే ఇదే పాసెంజెర్ పెద్దపల్లి పాసెంజెరుగా పెరు మార్చుకొని పెద్దపల్లికి సాయంత్రం 6:30 గంటలకి చెరుకొంటుంది. కాబట్టి విజయవాడలోనే పెద్దపల్లికి డైరెక్టు టిక్కెట్టు తీసుకొని రైలు దిగకుండానే వెళ్ళ వచ్చును.



విజయవాడ-డోర్నకల్/భద్రాచలం రోడ్-మహబూబాబాద్ -ఖాజీపేట్ -పెద్దపల్లి-కాజిపేట్ మహబూబాబాద్-డోర్నకల్/భద్రాచలం రోడ్-విజయవాడ 
పేసెంజరు  రైళ్ళ  వివరాలు. 

57254     Vijayawada to Dornakal/Bhadrachalam              08:00
57253     Bhadrachalam/Dornakal to Vijayawada              13:45

148SC    VIJAYAWADA-MAHBUBABAD-PEDDAPALLI[146SC]    10:00
 77251    PEDDAPALLI-MAHABUBABAD-VIJAYAWADA[77253]   08:00

57238  VIJAYAWADA-KAZIPET    12:45
57237  KAZIPET-VIJAYAWADA    04:00

67272   VIJAYAWADA-DORNAKAL-KAZIPET[67270]    18:15
 67269   KAZIPET-DORNAKAL-VIJAYAWADA[67271]     06:45

**************
ఈ లింకు నొక్కితే  విజయవాడ నుండి విశాఖ మరియు శ్రీకాకుళం వైపు   ప్రయాణ వివరాలు ...........

********



********


 కర్టేసి  ఇండియా రైల్  ఇన్ ఫో ,  అప్పుడప్పుడు అలా అలా,   వనితా టివి,   సింపుల్ అండ్ స్మార్ట్, వికీపీడియా, 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి