LOCAL WEATHER

30, నవంబర్ 2012, శుక్రవారం

ఎలికల కోసం ఏనుగులని తెచ్చుకొంటామా...? [FDI....PART-2]


ఏదైనా దేశం తనకు చాతనైనంత వరకూ ఇతర దేశాల మీద ఆధరపడకుండా ఉండాలనే చూస్తుంది.  కారణం...అమూల్యమైన దేశ ప్రజల సొమ్ము బయటకు పోకూడదనే.....  అందువల్లనే, తప్పనిసరైన పరిస్థితులలో, తమ దేశంలో తయారు కానివి, దొరకనివి, కుదరనివీ మాత్రమే బయట దేశాల నుండి తెప్పించుకొంటుంది. అవి వస్తువులు కానీ, సేవలు కానీ;  దీని వలన, దేశ ఎకానమీ బలంగా ఉంటుంది....  దేశానికి ఇలాంటి బలమైన ఆర్ధిక వ్యవస్థను,  మంచి ఆర్ధిక విధానంతో పరిపాలన చెయ్య వలసిన బాధ్యత అంత పరిపాలకులదే...    

అయితే, ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలు  బయటి దేశల ప్రజల కొనుగోలు మీద ఆధారపడి ఉన్నందున వారు "గ్లోబలైజేషన్" అన్న పదాన్ని పైకి తెచ్చారు.......గ్లోబలైజేషన్ పేరుతో బయట దేశాల అన్ని వస్తువులూ దేశంలోనికి వరదలా రావటం మొదలైంది....దేశంలో దొరికే వస్తువులు కూడా బయట దేశాల నుండి రావటం ...  పైగా, దేశంలోని వస్తువులకి పోటిని ఇవ్వటానికి, బయట దేశం వస్తువులు అతితక్కువ ధరలకే దొరికేట్లు చేస్తున్నారు. దీని  వలన దేశంలో దొరికే వస్తువులకి డిమాండు తగ్గింది. దీనితో దేశీయ వస్తువులు తయారీ దారుల పనికి తీవ్రమైన విఘాతం కలుగుతోంది.  వీటికి తోడు చిల్లర వర్తకాలకి సంబంధించి "విదేశీయులు డైరెక్టుగా పెట్టుబడులు పెట్టచ్చు" అనే చట్టం వలన పనీ పాటా చేసుకొనే ప్రజల పరిస్థితి  "మూలిగే నక్కపై తాటి పండు  పడినట్లవుతోంది". 

ఈ గ్లోబలైజేషన్ అన్న పదాన్ని ఒకప్పుడు వలసలని నిర్వహించిన వారి నిర్వాకమే....వారు ఎంత మంచి వాళ్ళంటే.....  వారు మన దేశానికి   పాలకులుగా  ఉన్నప్పుడు..."ఏ సంస్థానంలో అయినా వారసులు లేక పోతే అది తమదే"  అన్న చట్టం చేసిన ఘనులు......అలా అవసరం కొద్దీ నీతీ నియమాలను తప్పే జాతి వారికి,  మళ్ళీ ప్రపంచ దేశాల పైన వ్యాపార ఆధిపత్యం  చెయ్యాలిసిన అవసరం పడింది.  కారణం...వలసలుగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందటం మొదలవటం;  దానితో  వీరి దేశంలో వారికి పని తగ్గింది...  అందుకని, ఇదివరలో తాము చేసిన  వారసత్వపు చట్టం లాంటిదే గ్లోబలైజేషన్ అనేదాన్ని పైకి తెచ్చారు. ఇప్పుడు "చట్టాలు చేసే స్థితిలో"  లేవు కనుక...."చట్టాలని చేయించే" పనిలో పడ్డారు.....అవును మరి, వారి  దేశాల  కోసం వారు చేసుకొంటున్నారు. 

అయితే, అసలు  విచారకరమైన విషయం ఏమంటే, ఒకప్పుడు మన    దేశానికి    చెందిన    రాజులూ,  సుల్తానులూ వలసదార్లకి సహకరించినట్లు, ఇప్పుడు రకరకాలైన రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ సహకరిచటమే....  ఈ వలసదార్ల దేశాలు రాజకీయ నాయకులను ఎలా లొంగదీసుకొన్నారో మనం వేరే చెప్పుకోవఖర్లేదు...ఎందుకంటే, చరిత్రలో రాజులూ, సుల్తానులూ తమ ఆధిపత్యాల కోసం కాని, విలాసాలకి కోసం  కానీ, దురాక్రమణల కోసమైతే కానీ  ఈ వలసదార్లతో ఎలా  సహకరించారో, అలాగే, అలాంటి బలహీనతలున్న,  ప్రస్తుత రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ మళ్ళీ వారితోనే జత కట్టి తమ  శత్రువులను{???} సాధించటానికి పూనుకొన్నారు... దీనితో, వలస దారుల పని "మళ్ళీ" చాలా తెలికైంది.  మన దేశంలోని పాలక ప్రతిపక్షాలు ఒకరికొకరు శత్రువులులాగా ప్రవర్తిస్తున్నారే కానీ, ఇద్దరి పనీ ప్రజలకి సేవలందించటం అన్న సంగతి మర్చేపోయ్యారు. పాలక ప్రతిపక్షాల పరిస్తితి ఎలా ఉన్నదంటే;  ప్రతిపక్షం వద్దంది కాబట్టి, ఇది చెసి తీరాలి అన్న పట్టుదలతో ఒకప్పుడు తాము ప్రతిపక్ష హోదాలో FDI లను  వద్దన్నామన్న సంగతి కానీ,  ఇందులో ప్రజాప్రయొజనాలున్నా, లేకపోయినా దీర్ఘ కాలంలో  మన ప్రజలకి కీడు చేస్తుందన్న స్ప్రుహ కానీ పాలక పక్షానికి లేదు.... ఒకప్పుడు పాలక పక్ష హోదాలో ఈ పాడు పని తామే మొదలు పెట్టామన్న సంగతి ప్రక్కన పెట్టిన ప్రతిపక్షం......ఈ సందర్భాన్ని తమ రాజకీయ ప్రయొజనాలకి వాడుకొంటున్నదే కానీ,  ప్రజలకోసం కాదు...   

స్వాతంత్రం వచ్చి రెండు మూడు దశాబ్దాల వరకూ బాగానే ఉన్న ప్రజలు, తరవాతి కాలంలో అనేక ప్రలోభాలకి గురవుతో వస్తున్నారు....దానితో  ప్రజలు, స్వయం సిద్దంగా బ్రతకాలిసిన వారు, ఉద్యోగాలకోసం ఎగబడ్టం, కొట్టుకోవటం చేస్తున్నారు....ఈ ఉద్యోగాల పేరుతో కులాలుగా, మతాలుగా విడిపోయి ఒకరికొకరు శత్రువులుగా భావించుకొంటున్నారు, ఎవరి దారి వారిదే అన్న చందాన తయారైనారు.  ప్రజావసరాలకి సంబంధించిన వ్యాపారస్తులు చూస్తే, అధిక లాభాల కోసం తమ వ్యాపారాలని నీతీ నియమాలు లేకుండా చేస్తున్నారు....దీంతో మంచి క్వాలిటీ వస్తువు అన్న విషయమే మరచి చాలా రోజులైంది....ఎవరన్న బాధ పడతారని కానీ, ఇబ్బంది పడతారని కానీ, ఎమైన అంటారని కానీ లేకుండా.....సిగ్గు సిరం లేని వ్యాపారాలు చేస్తున్నరు.....కొనుగోలు చేసేటప్పుడు గుంపుగా ఏర్పడి వస్తువు తయారీదారులని, ముఖ్యంగా వ్యవసాయ దారులనూ మోసం చేస్తూ తక్కువ ధరలకి కొని, అదే  పద్ధతిలో ప్రజలకి ఎక్కువ ధరలకి అమ్ముతో నీతిలేని వ్యాపారాలు చేస్తున్నారు......వీరికి ప్రస్తుతం ఉన్న అవినీతి పరిపాలనా వ్యవస్థ కూడా సహకరిస్తుంటం జరుగుతోంది. 
     
మామూలు ప్రజావసరాలకి సంబంధించిన వ్యాపారాలలో విపరీత లాభాలు  రావటంతో,   దేశంలో ఉన్న  పెద్ద పెద్ద వస్తూత్పత్తి చేసే డబ్బున్న వారి కన్ను ఈ వ్యాపారాల మీద పడింది. వారు మాల్స్ మార్టులు అంటూ మొదలు పెట్ట సాగారు........ డబ్బున్న మాములు వ్యాపారస్థులు నలుగురు కలిస్తేనే  సప్లై చేసే వారికీ, కొనుగోలు దారులకీ అన్యాయం జరుగుతుంటే, ఒకే పేద్ద మొత్తంలో కొనగలిన వ్యాపారస్తులు వస్తే ఇంకెంత అన్యాయం జరుగుతుంది....ఎందుకంటే నలుగురుగా ఉన్న వ్యాపారస్తుల మధ్య   ఉన్న విభేదాల వల్లన  కొద్ధిగానైనా  ధరలు  కంట్రోలు అవుతాయి...అదే ఒకరే పెద్దమొత్తంలో కొనుగోలు  చేసినట్లైతే ఇక వారు చెప్పిందే  వేదం అవుతుంది....లక్షలు పెట్టుబడి పెట్టే వాడు మార్కెట్టులో కొంత  భాగాన్నే ప్రభవితం చెయ్యకలడు, కోట్లు పెట్టుబడి పెట్టేవాడు మార్కెట్టులో చాలా  భాగాన్నే నియంత్రించకలడు..........ఇక వేల కోట్లు పెట్టుబడులు పెట్టే వారు వస్తే.............???  మన దేశంలో ఉన్న "దేశీయ మాల్స్ వారి వల్లనే వస్తువుల ధరలు నియంతృత్వానికి గురవుతుంటే....ఇక విదేశీయులు పెద్ద ఎత్తున డాలరుతో కొడితే"  మనం తట్టుకోగలమా....? మన మార్కెట్టులు పూర్తిగా వారి ఆధీనంలోనికి వెళ్ళిపోవా....???  "డాలరు వలన రూపాయి బలహీనపడుతుంటే, అదే  డాలరుని తెచ్చి రూపాయి నెత్తిన పెడతారా"........? ఇదెలా ఉన్నదంటే, ఇబ్బందిగా ఉన్న శత్రువుని తెచ్చి మనకి మనంగా నెత్తిన పెట్టుకున్నట్లుగా   ఉన్నది. 

"వారు వస్తే కనుక అందరికీ, ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధరలు ఒస్తాయి" అని అన్న "ప్రధాన ఆర్ధిక వేత్తకు", తమ దేశంలో కూడా పరిపాలన వ్యవస్థ అనేది ఒకటున్నదని తెలుసా.......తెలియదా......?  ఆ వ్యవస్థ ద్వారానే దేశాన్ని పరిపాలిస్తున్నది మన పరిపాలకులే కదా...?  అంటే, ఈ వ్యవస్థలోలోపాలున్నాయని, వాటిని పరిపాలించే వారే చెపుతున్నారా...??  ఆ వ్యవస్థ ద్వారా స్వంత దేశం వాళ్ళే మాట వినకపోతే ఏమీ చెయ్యలేని వాళ్ళు,  విదేశీయులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమి చెయ్యగలరు....??  ఈ వ్యవస్థల ద్వారా పరిపాలిస్తున్న వారే, వాటిలోని లోపాలను చూపి, ఇతర దేశాలవారైతే ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పటం ఎంతవరకూ సమంజసం.......వ్యవస్థలోని లోపాలని తెలుసుకొన్నప్పుడు, ఆ లోపాలని వీరే సరి చెయ్యచ్చును కదా...!!! అలా చెయ్యకుండా, మన దేశంలోని కొందరు ప్రజలు, మరికొందరిని మోసం చేస్తున్నారనే సాకుతో, వేరొక దేశం వారిని ప్రవేశపెట్టడం సరైనదేనా...???  "ఇంటిలో  ఎలుక దూరిందని  ఇల్లు తగలబెట్టాడు"  అన్న వెనుకటి సామెతెలాగా ఉన్నది........ మన పరిపాలకుల పద్దతి...!!!

ఈ వ్యవస్థలో అంతా అవినీతి పెరుకుపోయిందని, బయట దేశం వాళ్ళని పిలిచే వారు, రేపు పరిపాలనలో కూడా విదేశీయుల సహకారం తీసుకొంటే అప్పటి పరిస్థితి ఏమిటీ...? అయితే మన పరిపాలకులు "ఇది దేశ మరియూ  ప్రభుత్వ సారభౌమత్వానికి సంబంధించిన విషయం"  అనీ, తమదాకా రానియ్యరనే అనిపిస్తోంది ఇప్పటికి........!!!  అలాగే ప్రజా సామ్య దేశంలో  ప్రజలకి సంబంధించిన వాటిల్లో  విదేశీ జోక్యం ఉంటే  "ప్రజా సారభౌమత్వం"  దెబ్బతిన్నట్లు కాదా........!!!  కాబట్టి, మన నాయకులకి చిత్త శుద్ధి ఉంటే... ఎలికలకోసం ఇల్లు తగలబెట్టకుండా.... వారు వస్తే....వీరు వస్తే... అనే బలహీనం మాటలు మాట్లాడకుండా, దేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థను  చక్కగా ఉపయోగించుకొని, దేశంలోని ఎలికల కోసం మరిన్ని కఠినమైన చట్టాలని తెచ్చి, ఆ చట్టాలని స్వార్ధం కోసం నిర్వీర్యం చెయ్యకుండా,   సమర్ధ పరిపాలనతో దేశ ప్రజలందరికీ  న్యాయం చేయ్యచ్చును.......  అంతే కానీ, 
దేశీయ ఎలికల కోసం, విదేశీ ఏనుగులని తెచ్చి ప్రజల నెత్తి మిద పెట్ట కూడదు.  అలా చేసినట్లయితే FDI అంటే FOREIGN DIRECT INVESTMENT అని కాకుండా,   "FOOLS DIRECT INDIANS" అని అర్ధంవచ్చేటట్లు,  మన ఘనత వహించిన రాజకీయ నాయకులే చేసిన వారవుతారు.......!!!


****************

****************


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి.....



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి