LOCAL WEATHER

13, నవంబర్ 2012, మంగళవారం

భారత్‌కి మిత్రులా లేక చైనాకి తొత్తులా మన మీడియా.....


భారత్‌కి  మిత్రులా లేక చైనాకి తొత్తులా మన మీడియా.....ఉదయాన్నే లేచిన దగ్గర నుండీ మన దేశాభివృద్ధి, దానికి సంబంధించిన విషయాలు చూపించాలిసిన మన మీడియా వారు, పనికిమాలిన రాజకీయ సొల్లు కబర్లు చెప్పుకొంటూ...దేశంలోని ప్రజలను తప్పుదోవ పట్టించటమే కాకుండా....... ప్రపంచంలో మరే దేశం దొరకనట్లు చైనాతో మన దేశాన్ని పోలుస్తూ ఒకటే ఊకదంపుడు విషయాలు....చైనాలో అయితే ప్రజలు లైన్లో నుంచొని రైలెక్కుతారుట, అదే మన దేశంలో అయితే తొక్కుకు చస్తారుట.....   అక్కడికి, వీరు చైనా అంతా తిరిగి చూసినట్లుగా పిచ్చి వాగుడు.....అదీ కూడా  ఒక చైనా వెబ్ సైటులో ఉంచిన,  ఒకే ఒక్క ఫొటో ఆధారంగా.......

చైనాలో  అయితే అవినీతికి ఉరి శిక్షేనట....అదే కనుక మన దేశంలో అయితేనా.......మరి మొన్నటి సమావేశాల్లో వారి దేశాధినేతలే అవినీతి గురించి పెద్ద ఎత్తున బాధ నటించేశారు....???  అంటే, చైనాలో అవినీతికి ఉరి శిక్ష అన్నా ఆగని  అవినీతి పెద్దదా....?  లేక భారత్‌లో   "ఆ  ఇక్కడ మన దేశంలో  ఆ ఏమి చేస్తారులే"  అన్న నిర్లక్ష్యం వల్ల పెరిగిన అవినీతి పెద్దదా......? అవినీతి విషయంలో చైనా వారికి  ఉరి శిక్ష అన్నా భయం లేదన్నమాట!!!!  అదే మన దేశంలో కనుక అవినీతికి ఉరి శిక్ష అమలు చేస్తే,  అక్షరాలలో నుండీ కూడా "అ" అనే అక్షరాన్ని కూడా తొలగించేస్తారు.

మొన్నటికి మొన్న, ఆ దిక్కుమాలిన చైనా యుద్ధం  గురించి [50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా] మన మీడియా వారు చాలా వక్రీకరించి, తమ శాయా శక్తులా తమ చైనా విశ్వాసాన్ని చాటుకున్నారు.....ఆ యుద్ధంలో చైనా వారి తప్పేమీ లేదట.....వారు మనకి ముందుగానే చెప్పే దాడి చేశారని ఒక భారతీయ ...చైనా మిత్ర బ్లాగు ఒగచింది......పైగా మన దేశం అసమర్ధతే మన ఓటమికి కారణంట...మన దిక్కుమాలిన ఎర్ర బానిస మనస్థత్వంగల మీడియా ఉవాచ.... అంతేగానీ, నెహ్రూ గారు శాంతి సందేశాన్ని తన వెంట తీసుకెళితే, అక్కడ విషపు నవ్వులతో ఆమోదించినట్లు కనపడి..... ఆయన వెనుకాలే వచ్చి వెనుక దాడి చేసిన ద్రోహే చైనా అనీ ; ..... చైనా ద్రోహి అని తెలియక మనం సిద్దంగా లేము అనీ,   అందుకనే  ఇబ్బంది పడ్డామునీ...... ఏ  ఒక్క మీడియా  చెప్పలేదు.  ఈ సత్యాన్ని వధించటమే కాకుండా, మన దేశం విషయంలో మన మీడియావారు వాడే పదజాలం........ దేశం,  దేశ ప్రజల  మనొభావాలనూ,  మనోధైర్యాన్నీ దెబ్బతీసే విధంగా ఉన్నది. 

అయ్యా, మీడియా వారు,  ఒక విషయం తెలుసుకోండి.......ఇక్కడలాగా మీ చైనాలో కనుక అవాకులూ చవాకులూ పేలితే......అవినితి పరులనేమోగానీ,  ఒక్క మీడియా జనం మిగలకుండా ఉరితీసి పారేస్తారు.......అందుకనే అక్కడి విషయాలు చాలా చక్కగా అందంగా కనపడుతూ వస్తాయి.......మీరు  భారత్ దేశంలోని   స్వేచ్చని వాడుకొంటూ.......దానికి తగ్గట్లు ప్రవర్తించండి.  లేకపోతే,  మీ అతి స్వేచ్చ బాగా ముదిరి, మన భారత ప్రభుత్వం కూడా చైనాని........ అదే మీ చైనాని ఆదర్శంగా తీసుకొంటుంది.......అప్పుడు మాకు బాగానే ఉన్నా....మీకు మటుకూ బ్రతుకుతెరువు  ఉండదు!!!!!!! 

జై హింద్ 



6 కామెంట్‌లు:

  1. మన మార్క్సిస్టు మితృల చైనా ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పక్క చైనాలో ఉన్నది చైనాలో ఉన్నది నిజమైన కమ్యూనిజం కాదంటూనే, దానికి వత్తాసు పలుకుతూ, లోపాయకారిగా వారిని సమర్ధించడం మన వారికి వెన్నతో పెట్టిన విధ్య.

    అసలు మన కమ్యూనిస్టులు దేశానికి చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు. దేశం ఏమై పోయినా పర్వాలేదు. వారికి తమ సిద్దాంతం అమలయితే చాలు. మత తత్వ శక్తుల కన్నా ప్రమాదకరమైన వారు. వీరు ఏకంగా స్వతంత్ర సమరములో, బ్రిటీషువారికి సహాయం అందించి, స్వతంత్ర సమరం చేసే వారిని పట్టించారు. కారణం, బ్రిటీషు వారికీ, రష్యావారికీ ఉన్న అవగాహణ. అక్కడినుండి ఆర్డర్లు రాగానే ఇక్కడ బ్రిటీషు వారికి అనుకూలంగా పనిచేయడం మొదలు పెట్టారు.

    ఇక చైనా యుద్ద సమయములో అయితే, భారతదేశం బూర్జువా దేశమనీ, తమ చైనా శ్రామిక స్వర్గమని వాదించి, అటువంటి చైనా భారత్ మీద దురాక్రమన చేయదనీ, కేవలం బూర్జువా భారత్ మాత్రమే దాడిచేసే అవకాశముందని చెప్పారు.

    దాని గురించి మరో కమ్యూనిస్టే, రాసిన ఒక ఆర్టికలు చదవండి.
    My Left Foot
    Mohit Sen, a long-time insider of the CPI, retells its history of embarrassments. Excerpts


    భారత దేశములో మీడియా స్వేచ్ఛలేదని వాపోయే వారు, అదే చైనా తియనాన్మెన్ స్క్వేర్ గురించి ఒక్క వార్తా రాకుండా మొత్తం సెన్సారు చేస్తుందన్న విషయం మాత్రం కన్వీనియంటుగా తొక్కి పెడతారు. వార్తలే కాదు, దాని సంబందించిన పదాలు కూడా ఫిల్టర్ చేయబడతాయి. అంతెందుకు, ఇటీవల అధ్యక్షుడి అవినీతి గురించిన వార్తల్ని, సమీక్షల్నీ ప్రసారం చేస్తున్న మీడియాని కూడా బ్యాన్ చేశారు. అలాంటి దేశాన్ని చూసి మీడియా స్వేచ్ఛ తెలుసుకోవాల్సిన దుస్తితిలో మన దేశం లేదని పాపం వీరు గ్రహిస్తే మంచిది.

    లోకం మొత్తానికీ తెలుసు, మన కమ్యూనిస్టుల ప్రాపగోండా గురించి. కానీ, పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ తమను ఎవరూ చూడడం లేదనుకున్నట్లు వారు అవి పట్టించుకోరు. జనాలు అమాయకులనీ, ఇంకా తాము చెప్పే కాకి చరిత్రనే నమ్ముతున్నారనే భ్రమలో ఉన్నారు. ఉండనివ్వండి.

    రిప్లయితొలగించండి
  2. శివరామప్రసాదు కప్పగంతు గారు, Sri kanth గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. @Srikanth

    During 1960s the lackeys of China must have sent some favourable reports to their handles in Peking saying that you just occupy up to Guwahati and we shall bring up a leftist revolution in the Country. Unfortunately for them no such revolt has resulted and meanwhile, USA started showing interest in favour of India and Chinese were compelled to stop dead their tracks.

    రిప్లయితొలగించండి
  4. durgeswara గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి