LOCAL WEATHER

5, ఫిబ్రవరి 2015, గురువారం

కాంగ్రెస్సు గతే మీకు పట్టాలా....

ఆత్మగౌరవ యాత్ర ఇదివరకు ఎవరో చేశారు గానీ... ఇప్పుడు ఆంద్రరాష్ట్ర ప్రజల కోసం మళ్ళి  ఆ దారి పట్టలిసిన అవసరం కనపడుతోంది... మొన్నటి దాకా ఎవరి  చేత నానా బూతులు తిన్నారో వారి ప్రాపకం కోసం ఆంధ్రా నాయకుల తాపత్రయం చూస్తుంటే "వీరు ఎక్కడి నాయకులు" అని అనిపించక మానదు...పైగా వారి స్వప్రయోజనాల కోసం ఆంధ్రా ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు... అధికార పార్టీ వారు హైదరాబాదు నుండీ వస్తామంటునే అక్కడి నుండి రావటానికి ఎందుకనో నానా బాధలు పడుతున్నారు...ఆంద్ర రాష్ట్రానికి సంబంధించిన డబ్బు...చదవు విషయంలో వాళ్ళు నిర్మొహమాటంగా ఉంటే... విద్యుత్ మరియూ నీళ్ళ విషయంలో వీళ్ళు ఎంతో ఉదాసీనంగా ఉంటూ ఏ మాటంటే తెలంగాణలో మళ్ళీ గెలవలేకపోతామో అన్న భయంతో వణికి పోతున్నారు... అధికారం ఇచ్చిన ప్రజల ప్రయోజనాలని ఫణంగా పెట్టి...తెలంగాణలో గెలవాలనే దిక్కుమాలిన ఆలోచనలో వారున్నారు..."బాబూ అధికార పార్టీ వారూ మీకు ప్రక్క రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మీ స్వంత డబ్బులు, స్వంత శ్రమతో చూపించండి"....అంతేకానీ అధికారమిచ్చిన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టకండి....ఉన్నది కూడా పోతుంది... దీని గురించి ఇదివరకే  ఇదే బ్లాగులో "బాబుగారూ బేల మాటలేల...ఏవరి ప్రాపకం కోసము...???" మరియు "ఆంధ్రప్రదేశ్‌నకు ఫుల్ టైం ముఖ్యమంత్రి కావలెను...!!!" అని వ్రాయటం జరగింది...[లింకులు నొక్కండి] వీరితో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన ఉద్యోగులు  కూడా స్వంత రాష్ట్రానికి రావటానికి ఎందుకనో మొహమాటం పడుతున్నారు... 

ఒకే వార్తని ప్రాంతానికో రకంగా...

ఇక ప్రతిపక్ష నాయకుల సంగతి చెప్పనే అక్కర్లేదు... ఇదివరలో  తెలంగాణా ఉద్యమం పేరుతొ అక్కడి పార్టీల వాళ్ళు ఆంధ్రావారిని తిట్టినట్లుగా...ఇప్పుడు, వీరు అధికార పార్టిని తిడుతున్నామనుకుని ఆంధ్రా ప్రజలని అవమానిస్తున్నారు...అదికాక...రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రత్యేక హోదా కోసం కొందరు పోరాడుతుంటే...వీరు ఎక్కడెక్కడి లెక్కలో వేసి ఆంధ్రాలో ఆదాయం బాగానే ఉన్నదనీ, కాబట్టి దీనికి ప్రత్యేక హోదా అవసరం లేదని లెక్కలతో సహా వ్రాసేస్తున్నారు..."వీరు ప్రతిపక్షంగా ఉన్నది తెలుగుదేశం పార్టీకా లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకా" అనేది అర్ధం కావటం లేదు. ప్రతిపక్షం పార్టీ వారూ...మీరు ఉన్నది అధికార పార్టీని కట్టడి చెయ్యటానికి, ఆంధ్రులని అవమానించిన కాంగ్రెస్సు పార్టీని ప్రక్కనపెట్టి  మీకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చినది అందుకే... ఉద్యమం సమయంలో దిక్కుమాలిన పార్టీలా ఆంధ్రులని అవమానించటానికి కాదు...రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్సుకి ప్రత్యామ్నామంగా అధికారం ఇవ్వటానికి కూడా... అయితే, ఇప్పుడు ఇలాగే ఎవరినో తిడుతున్నామని అనుకునే రాష్ట్ర ప్రజలని అవమానించి వారికి రావాలిసిన ప్రయోజనాలని దెబ్బతీస్తే...కాంగ్రేస్సుకి పెట్టిన గతే మీకు పడుతుంది...


ఈ ముందరి మాటలు ఏమయ్యాయి... ఏరు దాటాక...

దిల్లి అధికార పార్టీ బిజేపి విషయానికోచ్చినా ఆంధ్రులకి వాళ్ళు పికేందేమి కనపడటం లేదు...ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ఇలాగే జరగనిస్తే  ఆ మంచి పేరు తెలుగుదేశం పార్టీకి ఎక్కదోస్తుందో అనే దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలిసిన ప్రయోజనాలని త్రొక్కి పెడుతున్నారు... ఉన్న ఒకరిద్దరు పార్టీ సభ్యులతోనే ఎదో సాధించాలని చూస్తున్నారు...ప్రేత్యేక హోదా ఇవ్వాలిసి ఉండగా...పేకేజీలతో కప్పిపెడుతున్నారు... "అయ్యా వెంకయ్యనాయుడుగారు ఆ రోజున కాంగ్రెస్సు అన్యాయం చేస్తోందని సభా సాక్షిగా ఏవేవో కోరికలు అప్పటి ప్రధాన మంత్రిగారి చేత ప్రమాణం చేయించుకుని... తీరా మీరే కోర్కెలు తీర్చే వారుగా మారినా కూడా... ఎందుకు మాటల గారడితో ప్రక్కదారి పట్టిస్తున్నారు...??? పాపం మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్సుకి పట్టిన గతి పూర్తిగా తెలియకపోవచ్చును..మీకు తెలుసును కదా కాంగ్రెస్సు ఎంత పవర్ ఫుల్ పార్టీ అయినా... ఎందుకని ఇక్కడ మట్టికోట్టుకుని పోయిందో...అదే గతి మీ పార్టికి పట్టాలన్నా ముందర కాంగ్రెస్ అంత పెరగాలికదా... ఇప్పుడే మీ పార్టీని ఆంద్ర ప్రజలు మూల కూర్చోపెడతారు అని కూడా చెప్పలేము కదా...ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో పెరిగితే కదా పొయ్యారు అనే గౌరవం అయినా దక్కేది...దిల్లి ఎన్నికల సందర్భంగా... "దేశం ఏ తప్పునైనా సహిస్తుంది కానీ, మోసాన్ని సహించదు" అని మోడీ గారు అన్నారు.... కాబట్టి మార్వారీ తెలివితేటలు ప్రక్కన పెట్టి, రాష్ట్రానికి రావాలిసిన ప్రయోజనాలు అన్నీ ఇప్పించి, ఆదిలోనే పార్టీ కధ ముగిసిపోకుండా చూసుకోండి...అలా కాకుండా మీకిచ్చిన ఈ అవకాశాన్నిదుర్వినియోగం చేసుకుంటే, తిరిగి కాంగ్రెస్సుకి మీ తప్పులని సద్వినియోగం చేసుకునే అవకాశం మీరే ఇచ్చినట్లు అవుతుంది...!!!


ప్రక్క రాష్ట్రం టివీలలో ఇలాగే వస్తుంది మరి
ఒకాయన ఏ పికి మాత్రమే సిఎం.....మరొకాయన మొత్తానికి  సి ఎం 

చివరిగా మీడియా దగ్గరకి వస్తే... వీరు హైదరాబాదు వదలకుండానే ఓ కొత్త మాట...."తెలుగు రాష్ట్రాలు"...అనేది కనిపెట్టి...దానితోనే నెట్టుకుని రావాలని చూస్తున్నారు... అయితే, వారి భాషలోనే తాము ప్రక్క రాష్ట్రం టివీ వాళ్ళమని చెప్పకనే చెపుతున్నారు... తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన ఏ మంత్రి మాట్లాడినా... "ముఖ్యమంత్రి ఇలా అన్నారు, హోం మంత్రి అలా అన్నారు" అని తమ వార్తలలో చెపుతున్నారు... అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారి గురించి..."ఏపి సిఎం ఇలా అన్నారు...ఏపి అధికారులు అలా అన్నారు" అంటూ తమ పరాయి తత్వాన్ని వారే చాటుకుంటున్నారు ...  "అక్కడ ఆంధ్రప్రదేశ్" అని అనే బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చానళ్ళని మొదలు పెట్టవచ్చును కదా...ఇక్కడి ప్రకటనలతో డబ్బు కావాలి కాని... ఇక్కడికి రావాలంటే డబ్బు ఖర్చు పెట్టటం ఈ విశాల హృదయ్యంగల మీడియా వారికి ఇష్టం లేదు....కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ప్రేక్షకుల మన్ననల్ని పొందాలంటే ఇక్కడికొచ్చి "ఇక్కడి విషయాలతోనే వార్తలని చూపించి....ఆంధ్రా ప్రాంతపు ప్రజల అభిమానాన్ని చూరగొనటమే కాకుండా...హైదరాబాదులో కూర్చుని చేసే నారద కార్యక్రమాల వలన... చెడే ఆంధ్రా-తెలంగాణా సంబంధాలని కూడా మేరుగుపడేట్లు చెయ్యచ్చు"....అయితే వీరివల్ల పెద్ద ఉపయోగం లేదనుకోండి...వీరి ధైర్యం అంతా రాజకీయ నాయకుల వెంటపడి సొల్లు కార్చే వార్తల పట్లే కానీ...మొన్నటికి మొన్న ఇక్కడ విశాఖలో తుఫాను వస్తే, ఆ తుఫాను దృశ్యాలని చిత్రీకరించటానికి సరిపోలేదు...తుఫానుకి ఉన్న రెండు మూడు విడియోలు ఎవరో ఎమెట్యూర్స్ తీసినవే...ఉండటానికి ఓ 20 తెలుగు న్యూస్ చానళ్ళు ఉన్నాయి ఏం ఉపయోగం...

ఇవ్వన్నీ చూస్తుంటే...

"నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 

అన్నీ నవ్యంగానే ఉండాలిసిన అవసరం కనపడుతోంది...

కొత్త రాజధాని, 

కొత్త రాజకియపార్టీ[కేవలం ఈ ప్రాంతానికే సంబంధించినది], 

కొత్త మీడియా... 

అప్పుడుగాని 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న వనరులకి తగ్గట్టుగా అభివృద్ధి చెందదు"...

అని అనిపిస్తోంది...


@@@@@@@@





@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@











@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???

25] సొమ్ము సీమాద్రులది...సోకు తెలుగుదేశం పార్టీకి...!!!

26] ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???ం పార్టీకి...!!!
27] దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....




@@@@@@@@@@@@











   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి